వెండితెరకు లవర్ బాయ్ హీరో తరుణ్ బాలనటుడిగా పరిచయమైయ్యారు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు నటించారు తరుణ్. ఆ తరువాత ఇండస్ట్రీకి నువ్వే కావాలి సినిమాతో హీరోగా పరిచయమైయ్యారు. ఆయన హీరోగా వరస విజయాలు అందుకొని స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. అంతేకాదు.. తరుణ్ ఒకానొక సమయంలో లవర్ బాయ్ అనే బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఉన్నాడు. అయితే ఆ తరువాత వరస ఫ్లాపులతో ఇండస్ట్రీలో దూరమైయ్యాడు. ఇక తరుణ్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ ప్రేమకథలు కూడా చాలానే చేశారు. అయితే అప్పట్లో తరుణ్ ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడనే వార్తలు చాలానే వచ్చాయి.

ఇక అప్పట్లో  ఆర్తి అగర్వాల్, తరుణ్ పెళ్లి చేసుకోవాలనుకుందని దానికి ఆయన నో చెప్పేసరికి ఆత్మహత్యాయత్నం చేసుకుందని అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత ప్రియమణితో కూడా తరుణ్ ప్రేమాయణం కొనసాగించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక తరుణ్, ప్రియమణి కలిసి వ వసంతం సినిమాలో నటించారు. ఇక సినిమాలో నటిస్తున్న పసమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. అంతేకాదు.. ఇద్దరూ కలిసి పార్టీలకు వెళ్లారు.. అప్పుడు ఎక్కడ చూసినా వాళ్లే కనిపించేవారని వార్తలు వినిపించాయి. అయితే అది చూసి తరుణ్ అమ్మ రోజా రమణి ఒకరోజు సెట్స్‌కు వచ్చి మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలుసు.. పెళ్లి చేస్తానంటూ ఆఫర్ ఇచ్చిందట. ఇక ఈ విషయాన్ని ప్రియమణే చెప్పారు.

ప్రియమణి తరుణ్ వాళ్ళ అమ్మకి క్లారిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపింది. మేము ఇద్దరు ప్రేమించుకోవడం లేదు.. మా  ఇద్దరి మధ్య ఉన్న క్లోజ్ నెస్ చూసి తరుణ్ వాళ్ల అమ్మ కూడా తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఆ తరువాత ఆ విషయం అక్కడితోనే మరిచిపోయామని ఆమె చెప్పుకొచ్చింది. కానీ అప్పట్లో తరుణ్‌ను వాళ్ల అమ్మ పెళ్లి చేసుకోమ్మని మాత్రం అడిగారని వెల్లడించింది. ఆమె ఒప్పుకుంటే  తరుణ్ భార్య అయిపోయేదాన్ని అంటుంది ప్రియమణి. ఇక 2017లో ముస్తాఫా రాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: