కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్న సామెతను నిజం చేస్తూ ప్రస్తుతం టాలీవుడ్ లో ఇద్దరు బడా మ్యూజిక్ డైరెక్టర్లు తమ సినిమాల పాటలను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. వారే ఒకరు డీఎస్పీ మరియు మరొకరు ఎస్.ఎస్. థమన్. వీరిరువురు మ్యూజిక్ డైరెక్టర్లు గతంలో మహేశ్ బాబు, అల్లు అర్జున్ ల మూవీలకు పని చేసి ప్రస్తుతం కూడా వర్క్ చేస్తున్నారు. కానీ తారుమాయయ్యారు. గతంలో మహేశ్ బాబు సూపర్ డూపర్ హిట్ మూవీ సరిలేరు నీకెవ్వరు కు మ్యూజిక్ అందిచిన దేవీ ప్రస్తుతం అల్లు అర్జున్ టాలావుడ్ లెక్కల మాస్టారు కలిసి చేస్తున్న పుష్ప మూవీకి సంగీతం అందిస్తున్నారు. అలాగే గతంలో అల్లు అర్జున్ నటించిన హిట్ మూవీ అల వైకుంఠపురంలో కు బాణీలు సమకూర్చిన ఎస్. ఎస్ థమన్ ప్రస్తుతం సూపర్ స్టార్ పరుశురామ్ పేట్ల కలిసి చేస్తున్న మోస్ట్ అవేయిటెడ్ మూవీ సర్కారు వారి పాట కు స్వరాలు సమకూరుస్తున్నారు. గతంలో అదిరిపోయే బాణీలందించి అందర్ని ఊపేసిన థమన్ ఈ సారి మాత్రం సూపర్ స్టార్ సినిమాకు పనిచేస్తుండడం విశేషం.

గతంలో ఈ ఇద్దరు హీరోల సినిమాలు రిలీజయినపుడు అభిమానులు తమ హీరో చిత్ర మ్యూజిక్ బాగుందంటే తమ హీరో చిత్ర మ్యూజిక్ రికార్డులను కొల్లగొట్టిందని ప్రచారం చేసుకున్నారు. అలా ప్రస్తుతం ఇరువురు హీరోల సినిమాలు ఒకే సారి విడుదలవుతుండడం గమనార్హం. ఇప్పటికే విడుదల చేసిన సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ పోస్టర్ కి అదిరిపోయే స్పందన రావడంతో మేకర్స్ చాలా ఖుషీగా ఉన్నారు. చిత్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే ను పురస్కరించుకుని ఆగష్టు 9న మరో ట్రీట్ ఇవ్వనున్నట్లు ప్రకటించేశారు. ఈ ట్రీట్ మామూలుగా ఉండదని సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నారు. కాగా ఈ మూవీలో అందాల బొమ్మ కీర్తి సురేశ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: