హీరో హీరోయిన్లు పీకల్లోతు ప్రేమలో పడటం..తరువాత సెట్ కాక బ్రేకప్ లు చెప్పుకోవడం అనేది సినిమా పరిశ్రమల్లో సర్వసాధారణమైన విషయం.అయితే కొంతమంది హీరోయిన్లు చాలా సిన్సియర్ గా ప్రేమించడం వలనో ఏమో కానీ..బ్రేక్ అప్ విషయాన్ని అసలు అంత ఈజీగా తీసుకోలేరు.చాలా ఎమోషనల్ అయిపోయి తమ సినీమా కెరీర్ ను సైతం బాగా నిర్లక్ష్యం చేస్తుంటారు.ఇక గతంలో శృతీ హాసన్ ఇంకా అలాగే ఇలియానా వంటి స్టార్ భామలు కూడా లవ్ లో ఫెయిల్ అవ్వడంతో బాగా డిప్రెషన్ కు వెళ్లిపోయారు.ఇక ఈ లిస్ట్ లో తాజాగా దంగల్‌ లో అమీర్ ఖాన్ చిన్న కూతురుగా నటించిన సన్యా మల్హోత్రా కూడా ఈ లిస్ట్ లో ఉందనేది తాజా సమాచారం.ఇక ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్యా పలు ఎమోషనల్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
ఇక పూర్తి విషయంలోకి వెళ్తే… ఆమె ఢిల్లీలో ఉన్నప్పుడు ఓ అబ్బాయిని ప్రేమించిందట. నాలుగు సంవత్సరాల పాటు అతనితో రిలేషన్లో ఉన్న సన్యా చివరికి కొన్ని కారణాల వల్ల అతనికి బ్రేకప్ చెప్పాల్సి వచ్చిందని తెలిపింది. ఇక ఊహించని విధంగా అలా జరగడంతో ఆమె డిప్రెషన్ లోకి  వెళ్ళిపోయినట్టు ఆమె చెప్పుకొచ్చింది.ఇప్పటికీ తన బ్రేకప్ విషయం ఆమెను ఎంతగానో బాధిస్తోందని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. అలాగే దానికంటే బాధపడే విషయం మరొకటి ఉండదని…మనల్ని వద్దనుకున్న వారి గురించి మనం ఆలోచించకుండా ఉండలేమని.. కానీ వారి గురించి అసలు ఆలోచించకుండా ఉంటేనే మంచిదని తెలిపింది ఈ బ్యూటీ. ఇక ఎలాగోలా కోలుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తన ఫోకస్ అంతా కూడా తన ఆరోగ్యం ఇంకా సినిమాల పైనే పెట్టినట్టు వివరించింది .ఈమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా సన్యా నటించిన 'మీనాక్షి సుందరేశ్వర్' సినిమా ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో విడుదలై…ప్రేక్షకుల నుండీ మంచి విశేషమైన స్పందనను రాబట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: