టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా గురించి ఇప్పటికే రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతూ ఉండగా ఇప్పుడు మరో ప్రచారం మొదలైందట  

అదేంటంటే ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని అంటున్నారట  తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ వెనక్కి వెళ్లే అవకాశం ఉందంటూ అంటూ ప్రచారం మొదలైందట.ఆ వివరాల్లోకి వెళితే..
 
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబోలో ఆర్య, ఆర్య 2 లాంటి సూపర్ హిట్ సినిమాలు రావడంతో ఈ సినిమా ప్రారంభమైన నాటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయట.దానికి కారణం సుకుమార్ టేకింగ్ మాత్రమే కాక సినిమాలో మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ ఒక డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తుండడం గమనార్హం.
 

దానికి తగ్గట్టుగా ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడని అందరికి తెలిసిందే.ఈ సినిమా పూర్తిగా చిత్తూరు జిల్లా నేపథ్యంలో అక్కడి శేషాచలం అడవుల్లో జరుగుతున్న క్రమంలో చిత్తూరు యాస కూడా నేర్చుకున్నారట.ఇక ఈ సినిమాలో ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడని అంటున్నారు. ఆ లారీ డ్రైవర్ ఒక డాన్ గా ఎలా ఎదిగాడని తెలుస్తుంది.
 

ఇప్పటికే ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించిందని తెలుస్తుంది.మొదటి భాగం డిసెంబర్ 17న విడుదల కాబోతుందని ప్రకటించగా మళ్ళీ డేట్ మారే అవకాశం ఉందని ప్రచారం జరిగిందట.. అయితే అది నిజం కాదని 17నే సినిమా రిలీజ్ అవుతుందని ఇప్పటిదాకా విడుదలైన అప్డేట్స్ లో కనిపించిందని తెలుస్తుంది.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చిందని అదేంటంటే ఈ సినిమా దాని ప్రకారం ఈ సినిమా షూటింగ్ లేట్ కాకపోవడంతో సినిమా వాయిదా వేసే అవకాశం ఉందని అంటున్నారట.ఇంకా ఫస్ట్ కాపీ ఇంకా రెడీ కాలేదని అలాగే ప్రమోషన్స్ లో కూడా జోరు కనపడడం లేదని అంటున్నారట.అలాగే జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాను 24వ తేదీన విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారని తెలుస్తుంది..

ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని ఇక ఫహాద్ ఫాజిల్, సునీల్ మరియు యాంకర్ అనసూయ లాంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారట.పుష్ప సినిమా వాయిదా విషయం మీద త్వరలోనే ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారని చూడాలి మరి ఏం జరగబోతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: