డిసెంబర్ లో విడుదలయిన ఈ సినిమా అర్ధ శతదినోత్సవాన్ని పూర్తి చేసుకుని శతదినోత్సవం దిశగా పరుగులు తీస్తోంది, మొదటగా ఈ సినిమాను కేవలం తెలుగు భాషలో మాత్రమే రిలీజ్ చేశారు. కానీ రోజు రోజుకీ వస్తున్న ఆదరణ మూలాన ఇప్పుడు ఈ సినిమా యూనిట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాను నాలుగు భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. ప్రస్తుతానికి తమిళ్ లో రిలీజ్ కు సిద్ధమైంది. రేపు తమిళ్ భారీగా ఈ సినిమా రిలీజ్ కానుంది. త్వరలోనే హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లోనూ రిలీజ్ కానుంది. మరి అక్కడ కూడా ఇదే స్థాయిలో వసూళ్లు సాధించి రికార్డులను క్రియేట్ చేస్తుందా చూడాలి.
గత కొద్ది రోజుల క్రితం ఓ టి టి లో రిలీజ్ కాగా అక్కడ కూడా అఖండ తన సత్తాను చూపుతోంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్య జైస్వాల్ నటించగా, శ్రీకాంత్, పూర్ణ పలువురు తమ పాత్ర పరిధి మేరకు నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు.