సమంత, నాగ చైతన్య విడిపోతే వార్తలు గ్రాఫిక్స్ రూపంలో ఉన్న నేపథ్యంలో వీరిద్దరూ విడాకులు తీసుకున్నామనే వార్త అధికారికంగా ప్రకటించడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఇకపోతే సమంత - నాగచైతన్య ఇద్దరు కూడా తమ విడాకుల పత్రాన్ని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి చాలామందికి కన్నీటిని మిగిల్చారు.. సుమారుగా నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నామని మా ఇద్దరి మధ్య గొప్ప స్నేహబంధం ఎప్పటికీ కొనసాగుతుంది అని, ప్రొఫెషనల్ బంధం ఉంటుంది కానీ పర్సనల్ బంధం ఉండదు అని స్పష్టం చేశారు.


మా నిర్ణయాన్ని గౌరవించి మా ప్రైవసీకి భంగం కలిగించకూడదు అనే విధంగా వీరిద్దరూ కూడా విడాకుల ప్రకటనలో తెలపడంతో మీడియా సైలెంట్ అవుతుందని ప్రేక్షకులు కూడా అనుకున్నారు. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేకపోయింది.. ఎప్పటికప్పుడు వీరిద్దరిపై వార్తలు రోజురోజుకు పెరిగి పోతూ వైరల్ గా మిగిలిపోవడం గమనార్హం. బంగార్రాజు ప్రమోషన్స్ లో నాగచైతన్య ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ మేమిద్దరం విడాకులు తీసుకోవడానికి గల కారణం మా ఇద్దరి మంచి కోసమే.. ఇప్పుడు సమంత సంతోషంగా ఉంది.. నేను కూడా సంతోషంగా నే ఉన్నాను అంటూ నాగచైతన్య స్పందించారు.

ఇకపోతే తాజాగా అక్కినేని నాగార్జున ఒక ఇంటర్వ్యూలో సమంతా కావాలని విడాకులు తీసుకుందని అది నాగార్జున చెప్పారు అనే వార్త పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది.. నాగార్జున 2021 న్యూ ఇయర్ పార్టీ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలకు దారి తీశాయని తెలిపారట. సమంత నిర్ణయాన్ని నాగచైతన్య కాదనలేక అంగీకరించారు అని ,విడాకులు తీసుకోవాలనే నిర్ణయం మాత్రం ముందు సమంత కు వచ్చింది అని కానీ నాగచైతన్య నాగ్ గురించి చాలా బాధ పడ్డారు అని వార్తలు వినిపించాయి. కానీ ఇలాంటి రూమర్లపై తాజాగా నాగార్జున స్పందిస్తూ ఇందులో ఏ మాత్రం నిజం లేదని ఇలాంటి తప్పుడు వార్తలను ప్రసారం చేయవద్దు అంటూ ఘాటుగా ట్వీట్ లో స్పందించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: