నందమూరి నట సింహం బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..అఖండ తో బ్లాక్‌బస్టర్ హిట్ ను అందుకున్న బాలయ్య  ఇప్పుడు అస్సలు గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.ఇప్పుడు రెండు మూడు సినిమాలను చేస్తున్నాడు.అంతేకాదు హోస్ట్‌గా చేసిన 'అన్‌స్టాపబుల్' షోకు ఎలాంటి రెస్పాన్స్ లభించిందో అందరికీ తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో ఈ టాక్ షో స్ట్రీమింగ్ కాగా, తొలి సీజన్‌కు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.


షోలో బాలయ్య ఎనర్జీకి అందరూ ఫిదా అయ్యారు. అయితే ఈ షో అయిపోయాక, మళ్లీ సీజన్ 2 కోసం డిమాండ్ పెరిగింది. అభిమానులు బాలయ్య టాక్ షోను ఏ రేంజ్‌లో ఎంజాయ్ చేశారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.ఆహా ఓటీటీ నిర్వాహకులు కూడా అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఉండబోతుందని చెబుతూ వస్తున్నారు. అయితే రీసెంట్‌గా బాలయ్య ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండియన్ ఐడల్ షోకు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఈ క్రమంలో యాంకర్ అన్‌స్టాపబుల్ సీజన్ 2 గురించి ఓ ప్రశ్న అడిగాడట. ఈ షో ఎప్పుడు మొదలు కాబోతుందని యాంకర్ అడిగిన ప్రశ్నకు 'మధుర క్షణాలకు ముగింపు ఉండదు… కొనసాగింపే అంటూ బాలయ్య బదులు ఇచ్చాడు.



అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఖచ్చితంగా ఉంటుందని.. దానికి కూడా బాలయ్యే హోస్ట్‌గా ఉంటాడనేది కన్ఫం అయ్యింది. అయితే ఈ టాక్ షోను అతి త్వరలో ప్రారంభించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే, దసరా పర్వదినాన ఈ టాక్ షోను స్టార్ట్ చేస్తారని.. అంతేగాక ఈ టాక్ షో తొలి ఎపిసోడ్‌కు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని నిర్వాహకులు అంటున్నారు. మరి నిజంగా ఈ టాక్ షోకు చిరు వస్తారా లేదా అన్నది మాత్రం కొద్ది రోజుల్లో తెలియనుంది..గొపిచంద్ మలినెని తో ఓ సినిమా చేయనున్నారు.. ఇటీవల ఆ చిత్రం నుంచి బయటకు వచ్చిన వీడియో అందరిని అకట్టుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: