ఒకప్పుడు చిన్న చితకా కమెడియన్స్ అందరూ కూడా సినిమాల్లో అవకాశాలు రావాలని బాగా పాపులారిటీ సంపాదించాలి అని భావించేవారు. కానీ ఇటీవలి కాలంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకునే కమెడియన్స్ ముందుగా బుల్లితెరపై ఫేమస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇక ఎన్నో ఛానల్స్ లో కామెడీ షోస్ బాగా పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే  థియేటర్ల లో సినిమాలలో దొరకని కామెడీఎంత
 ఇక బుల్లితెరపై ఎన్నో కామెడీ షో లు ప్రేక్షకులకు అందిస్తున్నాయ్. ఈ క్రమంలోనే టాప్ టిఆర్పి రేటింగులు కూడా సొంతం చేసుకున్నాయి.


 ఇలా కామెడీ షో ల ద్వారా ఒకవైపు నిర్వాహకులకు డబ్బులతో పాటు మరోవైపు కమెడియన్స్ కి పాపులారిటీ కూడా వచ్చేస్తుంది. కామెడీ షోస్ అన్ని ఒక్క దెబ్బకు రెండు  పిట్టలు అన్న ప్లాన్ తోనే ముందుకు సాగుతున్నాయ్ అని చెప్పాలి. ఇక ప్రతి పండక్కి కూడా అటు టీవీ చానల్స్ లో ప్రత్యేకమైన ఈవెంట్ ప్లాన్ చేసి ఇక కమెడియన్స్ తో హడావిడి చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు. అయితే ఇటీవలే బోనాల పండుగ నేపథ్యంలో జీ తెలుగు వారి జాతర అనే పేరుతో ఒక షో సందడి చేసింది. షో లో భాగంగా జీ తెలుగు లోని సీరియల్స్ నటులు కమెడియన్స్ అందరూ కూడా ఒక చోట చేరి సెలబ్రేషన్స్ అదరగొట్టేసారు.


 అయితే కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రాం ద్వారా బాగా పాపులారిటీ సంపాదించారు రియాజ్. తనలో ఉన్న లోపాన్ని ప్రేక్షకులకు నవ్వు ఇప్పించడానికి  ఉపయోగించుకుని తెగ ఫేమస్ అయిపోయాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే కార్యక్రమంలో కామెడీ స్టార్స్ కమెడియన్ రియాజ్ తన భార్యతో కలిసి స్టేజి మీదికి వచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. తన భార్య పేరు యాస్మిన్ అంటూ అందరికీ చెప్పి షాక్ ఇచ్చాడు. ఇక యాస్మిన్ రియాజ్ అని సద్దాం అనడంతో రియాజ్ తెగ సిగ్గుపడిపోయాడు అనే చెప్పాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: