తెలుగు ప్రేక్షకులకు కూడా డైరెక్టర్, నటుడు ఎస్ జె సూర్య సుపరిచితమే.. పవన్ కళ్యాణ్ తో ఖుషి వంటి చిత్రాలను తెరకెక్కించిన ఈ డైరెక్టర్ ఆ తర్వాత ఎందుకు చిత్రాలను తెరకెక్కించకుండా కేవలం పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలా స్పైడర్ సినిమాలు విలన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ఎస్ జె సూర్య, హీరోయిన్ ప్రియా భవాని శంకర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం బొమ్మై. మాన్స్టారు అంటే సక్సెస్ఫుల్ చిత్రం తర్వాత ఈ జంట కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు పెరిగిపోయాయి.


వైవిద్య భరితమైన కథ చిత్రాలకు దర్శకుడుగా పేరుపొందిన రాధ మోహన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాని ఏంజెల్ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తూ ఉన్నారు సంగీతాన్ని యువన్ శంకర్ రాజా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో నటి చాందిని ,డౌట్ సెంథిల్, ఆరోల్ శంకర్ తదితరులు ముఖ్యమైన పాత్రలు నటిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్ గత ఏడాది విడుదలై మంచి స్పందన లభించింది ఇదే విధంగా ఇటీవల ఆడియో ఫంక్షన్ కూడా చేయడం జరిగింది.



రొటీన్ సైకాలజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.. కానీ కొన్ని కారణాల చేత ఈ సినిమా విడుదల తేదీ మూడుసార్లు వాయిదా పడినట్టుగా తెలుస్తోంది.. ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.. భొమ్మై సినిమా ముందుగా ఈనెల 9వ తేదీకి షెడ్యూల్ చేయబడింది కానీ కొన్ని కారణాల చేత తిరిగి మళ్లీ ఈనెల 16వ తేదీకి పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలుస్తోంది.ఈ విషయాన్ని ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా పైన సినీ వర్గాలలో చాలా ఆసక్తి నెలకొనిందని చెప్పవచ్చు.. మరి సూర్య ఈ సినిమాతో మరింత పాపులారిటీ సంపాదిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: