టాలీవుడ్ లో హీరో గోపీచంద్ హీరోగా నటించిన తాజా చిత్రం భీమా.. ఇందులో హీరోయిన్స్ గా ప్రియా భవాని శంకర్, మాళవికా శర్మ నటించారు.. కన్నడ డైరెక్టర్ ఏ హర్ష దర్శకత్వం వహించారు.. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్స్ టీజర్ పోస్టర్లు కూడా ఈ సినిమా పైన భారీగా అంచనాలను పెంచేసాయి.. శివరాత్రి కానుకగా భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టాక్ ఎలా ఉందనే విషయం ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం..

భీమా సినిమాలోని యాక్షన్ సన్నీ వేషాలు ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అంటూ తెలియజేస్తున్నారు. ప్రతి యాక్షన్స్ సన్నివేశాలు  కూడా గూస్ బంప్స్ కలిగించేలా ఉన్నాయని పరశురామ క్షేత్రానికి సంబంధించిన డివోషనల్ పాయింట్ కూడా బాగానే చూపించారని తెలియజేస్తున్నారు.. ఈ చిత్రంలోని యాక్షన్స్ సన్నివేశాలు కూడా ఉన్నాయంటూ మరికొంత మంది నేటిజన్స్ ట్విట్టర్ రూపంలో వెల్లడిస్తున్నారు.. ఈ చిత్రంలోని ఇంటర్వెల్ ఫైట్ సీన్ క్లైమాక్స్ అదిరిపోయాయి అంటూ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కమర్షియల్ హంగులతో పాటు సినిమా కంటెంట్ కూడా బాగుందని గోపీచంద్ హిట్ ట్రాక్ ఎక్కేసారని అభిమానులు ఆనందాన్ని తెలియజేస్తున్నారు..

ఎన్నో ఏళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ కు భీమా సినిమా డబుల్ ట్రీట్ ఇచ్చిందని తెలుస్తోంది.. గోపీచంద్ ఇంతకు ముందు మూడుసార్లు పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు.. కానీ ఈసారి భీమా చిత్రంలో మాత్రం గతంలో కంటే చాలా భిన్నంగా పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారని తెలుపుతున్నారు. ఇలా సినిమా చూసిన పబ్లిక్ టాక్ వింటుంటే ఖచ్చితంగా ఈ సినిమా హీట్ టాక్ అందుకున్నట్టే అంటూ  తెలుస్తోంది.. మరి గోపీచంద్ ఖాతాలో ఎలాంటి కలెక్షన్స్ రూపంలో ఎలాంటి రికార్డులను  కొల్లగొడతాయో చూడాలి మరి.. ఇందుకు సంబంధించి కొన్ని ట్విట్టర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: