బాలీవుడ్ హీరోయిన్ గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో కలిసి ప్రస్తుతం అమెరికాలో నివసిస్తూ ఉన్నది.. అయితే ప్రస్తుతం ఇండియాలో పలు సినిమాలలో నటించేందుకు ఇటీవలే ముంబైలో కనిపించడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్ కి వచ్చి పలు రకాల ప్రాంతాలలో పూజా కార్యక్రమాలను చేయించి దేవాలయాలను దర్శనం చేసుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న SSMB 29 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతలోనే ప్రియాంక చోప్రా గురించి ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.


ముంబైలోని నాలుగు అత్యధిక అపార్ట్మెంట్లు సైతం 16.17 కోట్ల రూపాయలకు సేల్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంక చోప్రా అమ్మేసిన అపార్ట్మెంట్ల ధరల విషయానికి వస్తే.. ఒక అపార్ట్మెంట్లో నాలుగవ అంతస్తులు ఉన్న 4 కోట్ల రూపాయలకి అమ్మేశారని మరొకటి కోట్లకు అమ్మేశారు అన్నట్లుగా మరొకటి 2.85 కోట్లకు అమ్మేశారు.. మూడవ అపార్ట్మెంట్ 9 కోట్ల రూపాయలకు అమ్మేశారట.. అలా మొత్తం మీద 16.17 కోట్లకు సైతం తన నాలుగు అపార్ట్మెంట్లను అమ్మేసినట్లు పలు రకాల స్టాంపు పేపర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


మరి ప్రియాంక చోప్రా ఇలా అపార్ట్మెంట్లను ఎందుకు అమ్మేందో తెలియదు కానీ మొత్తానికి ఈ విషయంతో మరొకసారి హాట్ టాపిక్ గా మారుతున్నది. చాలా రోజుల తర్వాత ఇండియన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రియాంక చోప్రా రాజమౌళి సినిమా అనగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా కు కూడా గ్లోబల్ స్థాయిలో పేరు ఉండడంతో సినిమా ప్రమోషన్స్ కి కూడా ఉపయోగపడుతుందని రాజమౌళి ప్లాన్ చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సుమారుగా రెండు మూడు ఏళ్ల పాటు ఈ సినిమా షూటింగ్ తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయట. రెండు భాగాలుగా తీయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: