టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది విడుదలైన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో మరోసారి తన సత్తా చాటుకుని సాలిడ్గా వంద కోట్ల క్లబ్లో అడుగుపెట్టాడు. ఇప్పటికే వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటూ బిజీగా మారాడు. వాటిలో భారీ అంచనాలు ఉన్న సినిమా “ వెంకీ 77 ”. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో వెంకీ జత కట్టడంతో ఈ ప్రాజెక్ట్పై అభిమానుల్లో భారీ బజ్ నెలకొంది. త్రివిక్రమ్ - వెంకటేష్ కాంబినేషన్ అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కడా లేని ఆసక్తి ఉంటుంది. గతంలో వచ్చిన “నువ్వు నాకు నచ్చావ్”, “మల్లీశ్వరి” వంటి చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో నిలిచిపోయాయి. ఈ రెండు సూపర్ హిట్ సినిమాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వెంకీని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు.
ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్లోకి దూసుకెళ్లింది. కథ, క్యాస్టింగ్, గెటప్ అన్నీ సీక్రేట్గా ఉంచినా.. ఇండస్ట్రీ టాక్ ప్రకారం వెంకీ సరసన త్రిష మరియు శ్రీనిధి శెట్టి నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు హీరోయిన్లతో త్రివిక్రమ్ లవ్, ఎమోషనల్ డ్రామాను మిక్స్ చేయబోతున్నారట. ఇక ఈ సినిమా టైటిల్పై కొద్ది రోజులుగా పెద్ద చర్చ నడుస్తోంది. మొదట నుంచి “వెంకట రమణ కేరాఫ్ ఆనంద నిలయం” అనే టైటిల్ను సెట్ చేశారని వార్తలు వచ్చాయి. వెంకట రమణ అనే పేరు వెంకటేష్కు బాగా కలిసొచ్చిన పేరు కావడంతో ఆ పేరును టైటిల్గా పెట్టాలనుకున్నారని టాక్. కానీ కొన్ని రోజుల తరువాత మరో టైటిల్గా కుటుంబరావు పేరు ప్రచారంలోకి వచ్చింది.
అయితే ఇప్పుడు ఈ రెండు పేర్లు కాదు, కొత్త పేరు ఫైనల్ అయినట్లు టాక్ ? ఇండస్ట్రీ బజ్ ప్రకారం “బంధుమిత్రుల అభినందనలతో” అనే టైటిల్ని త్రివిక్రమ్ ఖరారు చేశారట. త్రివిక్రమ్ టైటిల్స్ కథకు ముందే ఆలోచనను చెబుతుంటాయి. దీని అర్ధం కావాలంటే సినిమా చూడాల్సిందే, కానీ భావన మాత్రం వెంటనే కనపడుతుంది. ఆ క్రమంలో ఈ కొత్త టైటిల్ కూడా పూర్తిగా కుటుంబ నేపథ్యం, బంధాలు, భావోద్వేగాలు, సంబంధాల విలువల చుట్టూ తిరిగే కథకు సరిగ్గా సూట్ అవుతుందని సమాచారం. ఏదేమైనా ప్రేక్షకులు మాత్రం ఈ కాంబినేషన్పై ఉన్న ప్రేమతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి