వైవిధ్యభరిత కథాంశాలతో తెరపై కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాడు అడవిశేషు. దర్శకుడిగా ఆయన కెరీర్ బిగినింగ్ చేసినా..తర్వాత సహాయనటుడిగా కొన్ని సినిమాల్లో నటించాడు. ఆ మద్య అదా శర్మ, యాంకర్ అనసూయ ముఖ్యపాత్రల్లో ‘క్షణం ’సినిమాతో ఒక్కసారే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ‘గుఢాచారి’ సినిమాతో మరో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. అలా వరుస విజయాలు అందుకోవడంతో దర్శక, నిర్మాతలకు ఆయనపై నమ్మకం పెరిగిపోయింది.
ఓ వైపు తాను సొంతగా కథలు రాసుకుంటున్న అడవిశేషు మంచి రచయిత. క్షణం, గుఢాచారి సినిమలతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా పెంచుకున్నాడు. ఈ యువ హీరో ఇప్పుడు మరోసారి ఎవరు సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద లాభాలను అందుకున్నాడు. టీజర్, ట్రైలర్ తో ఎంతో ఆసక్తి రేపుతూ ఎన్నో అంచనాల మద్య ‘ఎవరు’ సినిమా రిలీజ్ అయ్యింది.
సస్పెన్స్ మర్డర్ మిస్టరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎవరు సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. కంటెంటె బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అందరికీ తెలిసిందే. వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ అందాయి. 10కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఎవరు ఫైనల్ గా పది కోట్ల షేర్స్ ను అందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాకు డబ్బింగ్ రైట్స్ ద్వారా అలాగే డిజిటల్ మార్కెట్ లో మంచి రేటు దక్కడంతో 5కోట్ల లాభాలను అందుకుంది. అయితే ఈ సినిమా నిర్మాణానికి దాదాపు 4 నుంచి 5 కోట్ల బడ్జెట్ అయి ఉంటుందని టాలీవుడ్ అంచనా.
అయితే ఈ మార్కు అప్పుడే దాటడంతో లాభాల భాట పట్టినట్టు అర్థం అవుతుంది. మొత్తంగా అడివి శేష్ సినిమాపై నమ్మకంతో బిజినెస్ చేసిన వారికీ లాభాల్ని అందించాడు. ఇక నెక్స్ట్ మేజర్ సినిమాతో రెడీ అవుతున్న శేష్ గూఢచారి సీక్వెల్ ని కూడా త్వరలో స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.