
గత ఏడాది జనవరిలో జగన్ సర్కార్ శాసన మండలి తీర్మానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేసింది. ఆ దిశగానే అడుగులు వేసి తీర్మానాన్ని రద్దుచేసింది. అదేరోజు క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేసి ఆమోదం కూడా తెలిపింది. ఈ యొక్క బిల్లును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కింద సర్కార్ కి పంపింది . కానీ కేంద్ర సర్కార్ ఈ యొక్క బిల్లుపై ఎలాంటి సమాధానం చెప్పలేదు. దీంతో ఆ బిల్లులు పెండింగ్లో పడింది. దీంతో వైసీపీ ఎంపీలు కొంతమంది కేంద్రాన్ని అడిగినప్పటికీ కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. పరిపాలన వికేంద్రీకరణ సిఆర్ డి ఏ చట్టం రద్దు బిల్లులు ప్రభుత్వం శాసన సభలో ఆమోదించి గత ఏడాది జనవరి 20వ తేదీన శాసన మండలికి పంపించింది. మండలిలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. దీంతో టీడీపీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. సెలెక్ట్ కమిటీని కూడా నియమించారు.