ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా అత్యాచారానికి సంబంధించిన ఘటనలు పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలలో మార్పులు తీసుకొస్తున్నప్పటికీ అత్యాచార ఘటనలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. కన్నబిడ్డ వయస్సున్న చిన్నారులపై కూడా కామాంధులు అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. అభం శుభం తెలియని పసిపాపలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజూ ఏదో ఒక ప్రాంతంలో అత్యాచారాలకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీలో సీఎం జగన్ అత్యాచార ఘటనల సంఖ్యను తగ్గించటం కోసం ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయగా దిశ చట్టం కేంద్రం ఆమోదం పొందాల్సి ఉంది. 

తాజాగా హైదరాబాద్ లో మరో దారుణ అత్యాచార ఘటన చోటు చేసుకుంది. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన ఎస్.ఆర్.నగర్ లో జరిగింది. 30 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి 8 సంవత్సరాల బాలికకు చాక్లెట్లు, పానీపూరి, సమోసాలు ఆశ చూపి అత్యాచారానికి పాల్పడ్దాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని అత్యాచారానికి పాల్పడిన నాగరాజును అరెస్ట్ చేశారు. ఈరోజు నాగరాజును రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు చెబుతున్నారు. 
 
పూర్తి వివరాలలోకి వెళితే హైదరాబాద్ లోని బీకె గూడ దగ్గర చిత్తు కాగితాలు ఏరుకునే  కొన్ని కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నాయి. బాధిత బాలిక తల్లిదండ్రులు బాలికను ఇంట్లోనే ఉంచి చిత్తు కాగితాలు ఏరుకోవటం కోసం బయటకు వెళ్లారు. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న నాగరాజు బాలికకు చాక్లెట్లు, సమోసాలు ఆశ చూపి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పటంతో బాలిక కుటుంబ సభ్యులు సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేయగా నాగరాజు నిందితుడని తేలింది. నిందితుడు నాగరాజు కఠినంగా శిక్షించాలని బాధిత బాలిక కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: