వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణపై ఫైర్ అయ్యారు. ఏపీలో బీజేపీ పార్టీ బలపడకపోవడానికి, మోదీ ఇమేజ్ పెరగకపోవడానికి కన్నా లక్ష్మీ నారాయణ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు అమ్ముడుపోయిన కన్నాలాంటి వారే ఇందుకు కారణమని అన్నారు. రాజకీయాల్లో అవసాన దశలో ఉన్నవారిని కూడా లేపి కూర్చోబెట్టే విధంగా బాబు ఆఫర్ ఉంటుందని అన్నారు. 
 
విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో "దేశవ్యాప్తంగా మోదీ గారి ఇమేజి పెరిగినా రాష్ట్రంలో ఆ పార్టీ ఎదగక పోవడానికి బాబుకు అమ్ముడు పోయిన కన్నాలాంటి వారే కారణం. బాబు ప్యాకేజి ఆఫర్ ఎలాగుంటుందంటే రాజకీయంగా అవసాన దశలో ఉన్నవారినీ లేపి కూర్చోపెడుతుంది. మొదటి నుంచి బిజెపిలో ఉన్న వారు కన్నాలాంటి జంబూకాలను వదిలించుకోవాలి" అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో కన్నా లక్ష్మీనారాయాణ సుజనా చౌదరికి అమ్ముడుపోయారో లేదో చెప్పాలని అన్నారు. 
 
తనపై టీజేపీ (టీడీపీ జాకాల్స్‌ పార్టీ) వారు కాకుండా బీజేపీ వారు విమర్శలు చెస్తే సమాధానం ఇస్తానని అన్నారు. మరో ట్వీట్ లో నిన్నటివరకు టెస్టులు చేయడం లేదని... కరోనా కేసులను దాచిపెట్టిన వ్యక్తి నేడు ఎవరి అనుమతితో దక్షిణ కొరియా నుంచి కిట్లు కొనుగోలు చేశారని ప్రశ్నిస్తున్నారని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి ప్రభుత్వం ఏ పని చేయకూడదా...? అని ప్రశ్నించారు. 
 
విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్లపై కన్నా లక్ష్మీనారాయణ, చంద్రబాబు, టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉండటంతో.. ఆ పార్టీ నేతలతో సన్నిహితంగా మెలుగుతూ ఉండటం... విజయసాయిరెడ్డిపై విమర్శలు చేస్తూ ఉండటంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: