ఈ మధ్యకాలంలో హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. మనుషుల ప్రాణాలు తీయడానికి కనీసం మానవత్వాన్ని మరిచి దారుణంగా హత్య చేస్తున్నారు దుండగులు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ద్విచక్ర వాహనంపై ఓ  రౌడీషీటర్ తన కూతురుతో కలిసి పని నిమిత్తం  వెళ్తున్న సమయంలో... గుర్తుతెలియని దుండగులు కార్ తో  వెంబడించి అతి దారుణంగా అక్కడికక్కడే రౌడీషీటర్ నరికి చంపారు. కూతురు కళ్లెదుటే తండ్రిని పాశవికంగా నరికి చంపారు ముగ్గురు దుండగులు. బాడీని రెండు ముక్కలుగా చేసిన దుండగులు...  తలతో నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. ఘటన స్థానికంగా కలకలం రేపడంతో  పాటు ప్రజలను భయాందోళనకు గురి చేసింది. ఈ దారుణ ఘటన తమిళనాడులో జరిగింది

 

 

 వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని తిరుచ్చి జిల్లా శ్రీరంగం పట్టణంలోని డ్రైనేజీ వీధికి చెందిన రౌడీషీటర్ చంద్రమోహన్ ముగ్గురు దుండగులు చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. తన కూతురుతో కలిసి బైక్ పై  వెళ్తున్న చంద్రమోహన్ ను  ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కారులో వెంబడించారు. చంద్రమోహన్ వారిని  తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కుదరలేదు. ఈ క్రమంలోని దేవి థియేటర్  సమీపంలోకి రాగానే చంద్రమోహన్ బైక్ ని కారుతో అడ్డగించారు ముగ్గురు వ్యక్తులు. ఇక క్షణాల్లోనే కారులోంచి దిగిన ముగ్గురు వ్యక్తులు కత్తులతో చంద్రమోహన్ పై విరుచుకు పడ్డారు. 

 

 

 కూతురు కళ్ళముందే తండ్రిని అతి కిరాతకంగా నరికేశారు. అత్యంత దారుణంగా నరికిన  ముగ్గురు దుండగులు తలను మొండెం నుండి వేరు చేశారు. ఇక అనంతరం చంద్రమోహన్ తలను చేతిలో పట్టుకుని వెళ్ళి నేరుగా పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు ముగ్గురు నిందితులు. అయితే కళ్ళముందే తండ్రి ని అతి దారుణంగా హత్య చేయడంతో కూతురు తీవ్ర భయాందోళనకు గురి అయ్యింది. అయితే చంద్రమోహన్ కూతురును  మాత్రం సదరు నిందితులు  ఏమీ చేయలేదు. ఇక నిందితుడి తలతో  పోలీస్ స్టేషన్లో లొంగిపోగా ఈ ఘటనతో అటు పోలీసులు కూడా  షాక్కి గురయ్యారు . అయితే ఇప్పటికే చంద్రమోహన్ పై క్రిమినల్ కేసులు ఉండగా ప్రత్యర్థులే అతన్ని అంతమొందించింది కూడా అనుమానిస్తున్నారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: