వ్యవసాయ చట్టాల పై విమర్శలు చేస్తూ నిరసన ర్యాలీలు చేపడుతూ రోజుల తరబడి వ్యవసాయ చట్టం పై విమర్శలు గుప్పించినప్పటికీ రైతుల నుంచి మాత్రం ఈ వ్యవసాయ చట్టం పై వ్యతిరేకత రావడం లేదు. అదే సమయం లో రైతులందరి కీ ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డు కూడా అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులందరూ పంటకు సంబంధించిన ఎరువులు విత్తనాల ను కూడా ఎంతో సులభంగా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.
రైతులందరికీ చేయూత అందించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డు లే కాకుండా పశువులను కొనేందుకు కూడా భారీగా రుణం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా పాడి పరిశ్రమలను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి తరహా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త సదుపాయం ద్వారా పాడి పరిశ్రమ పై ఆధారపడి జీవించే ఎంతో మంది రైతుల కు చేయూత అందే అవకాశం ఉంది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది రైతులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకునేందుకు సిద్ధమయ్యారు.