కరోనా కేసులు రోజు రోజుకి చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి. ఏం చెయ్యాలో తెలీక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కేసులు మితిమీరిపోతున్నాయి.ఏం చెయ్యాలో తెలీక అధికారులు చేతులెత్తేస్తున్నారు.అటు డాక్టర్లు కూడా ఏమి చెయ్యలేక సతమతమతవుతున్నారు. ఇక అలాగే ఆక్సిజన్ కొరత కూడా చాలా ఎక్కువగా వుంది. ఈ నేపథ్యంలో సాయం చేసిన వారిపైనే అధికారులు రెచ్చిపోవడం బాధకరంగా వుంది.34 ఏళ్ల విక్కీ అగ్రహరి ఒక అంబులెన్స్ డ్రైవర్.ఉత్తరప్రదేశ్ జౌన్‌పూర్‌లో ఒక ప్రభుత్వ ఆస్పత్రి బయట ఆక్సిజన్ దొరక్క అల్లాడుతున్నరోగులకు తన అంబులెన్స్ నుంచి ఆక్సిజన్ సిలిండర్ తీసిచ్చినందుకు  విక్కీ అగ్రహరి పై అధికారులు కేసు నమోదు చేశారు.సాయం చేసేవారి గొంతు నొక్కేయడానికి జరుగుతున్న ప్రయత్నంగా చాలామంది ఈ కేసును చూస్తున్నారు.అధికారులు మాత్రం ఆ యువకుడు ఆస్పత్రి బయట గందరగోళానికి కారణమయ్యాడని, దాంతో మెడికల్ స్టాఫ్‌కు సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు.ఇంకా, ఆ యువకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏడీఎం టీమ్ ఈ పూర్తి ఘటనపై దర్యాప్తు చేస్తోంది. అనవసరంగా ఎవరినైనా శిక్షించడం అనేది మా ఉద్దేశంకాదని జౌన్‌పూర్ కలెక్టర్ మనీష్ వర్మ అన్నారు.పాండెమిక్ యాక్ట్ సెక్షన్ 3, సెక్షన్ 188, 269 కింద జౌన్‌పూర్ కొత్వాలీలోని విక్కీ అగ్రహరి అనే యువకుడిపై కేసులు నమోదు చేశారు. జౌన్‌పూర్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ అతడిపై ఫిర్యాదు చేశారు.


ఇక సాయం చేసేవారిపై కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వం వారిని నిరుత్సాహపరిచే ప్రయత్నం చేస్తోందని యూపీ విధానాలను తీవ్రంగా విమర్శేంచే మాజీ అధికారి సూర్య ప్రతాప్ షాహీ అన్నారు.యూపీ ప్రభుత్వం పరిస్థితులను అంగీకరించడం లేదు. ప్రజలను అంతా బాగుందనే భ్రమలో ఉంచాలని ప్రయత్నిస్తోంది. కానీ, ఆస్పత్రుల బయట జనం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఆ నిజాన్ని దాచలేకపోతోంది. ఆ భయంతోనే కేసు నమోదు చేసింది. నాపైన కూడా మూడు కేసులు పెట్టారు. కానీ వాటితో ఏం చేయలేరు. సాయం చేసేవారు బయటికొచ్చి సాయం చేస్తూనే ఉంటారున్నారు.జిల్లాలో తగినన్ని ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి, పడకలు పెంచాలి, ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ప్రయత్నించడం లేదని ఆయన ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: