ప్రస్తుతం రోజుకు జీవన నాణ్యత పడిపోతూనే ఉంది. అంతేకాకుండా ఆహారోత్పత్తి పారిశ్రామిక ఉత్పత్తి కూడా రోజురోజుకు దారుణంగా పతనం అవుతూనే ఉంది. అప్పట్లో పరిశోధకులు చెప్పింది ఇప్పుడు నిజంగానే నిజం అవుతుంది. అప్పట్లో ఇదంతా ట్రాష్ అని కొట్టి పారేసిన వారే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూసి అవును నిజమే అని అనుకుంటున్నారు.  భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి 1972 లోనే శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి అంచనా వేశారు. కానీ అప్పుడు ఎవరు ఈ విషయాలను నమ్మలేదు. కానీ ఇప్పుడు నమ్మక తప్పటంలేదు. మసాచుసెట్స్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే దానిపై 1972లో ఒక అంచనా వేశారు.



 ప్రపంచం మొత్తం కేవలం ఆర్థిక అభివృద్ధి పైనే దృష్టి సారిస్తూ పర్యావరణం జరుగుతున్న మార్పులపై అవగాహన లేమితో నిర్లక్ష్యంగా ముందుకు సాగితే 21వ శతాబ్దంలో ఇక మానవ సమాజం పతనం ప్రారంభం అవుతుంది అంటూ అప్పట్లో హెచ్చరించారు శాస్త్రవేత్తలు. లిమిట్స్ టు గ్రోత్ పేరుతో అప్పట్లో వారు రాసిన ఒక పుస్తకం బెస్ట్ సెల్లర్గా కూడా నిలిచింది. అయితే అప్పట్లో శాస్త్రవేత్తలు చెప్పిన ఈ నిజాన్ని ఇదంతా ఉత్తుత్తి మాత్రమే అని కొట్టి పారేశారు అందరూ.  కానీ ప్రస్తుతం మాత్రం అప్పుడు శాస్త్రవేత్తలు చెప్పినదే ఇప్పుడు నిజం అయ్యే దిశగా పరిణామాలు సాగుతున్నాయి.



 మానవుల తీరు ఇలాగే కొనసాగితే దశాబ్ద కాలంలో ఆర్థిక అభివృద్ధి ఇక 2040 నాటికి పూర్తిగా మానవ సమాజం పతనమై పోతాయి అని ఇటీవలే శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు అప్పటి పరిస్థితుల ఆధారంగా 1900 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం దాకా మానవ వికాసం ఎలా ఉంటుంది అనే విషయాన్ని అంచనా వేశారు. దీనికోసం అప్పట్లోనే వరల్డ్ నెంబర్ వన్ కంప్యూటర్ ప్రోగ్రామ్ ని కూడా ఉపయోగించారు. భవిష్యత్తులో జరగబోయే మార్పులను వెంటనే గ్రాఫ్ ద్వారా చూపించారు. ఈ క్రమంలోనే 2020నాటికి మానవ జీవన నాణ్యత పూర్తిగా పతనం అయిపోతుందని ఇక దీన్ని నివారించడానికి ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొంటాయని అప్పట్లోనే శాస్త్రవేత్తలు తెలిపారు. నిజంగానే ప్రస్తుతం కాలుష్యం ఏకంగా మనుషుల ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంది.  శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం చూస్తే 2040 నాటికి 1990 లో ఉన్న జనాభా కంటే తక్కువ జనాభా సంఖ్య ఉంటుందట. దీన్ని బట్టి చూస్తే ఇక 2040 కల్లా మనము మన కుటుంబాలు అంతం అయిపోతాయి అని  అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: