
అసలు విషయంలోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా రాయన్నపేటలో ఉండే గుమ్మి రామిరెడ్డి రాజ్ కోట్ నుంచి సుమారుగా నాలుగేళ్ల క్రితం రెండు గిరిజాతి ఆవులను తెప్పించుకొని మరి గోషాలను ప్రారంభించారట.. అలా ప్రారంభించిన ఆ గోశాల బాగా అభివృద్ధి చెందడంతో రామిరెడ్డి దగ్గర ఏకంగా 132 గిరిజాతి ఆవులు ఉన్నాయట. ఇప్పుడు అమ్ముడుపోయిన రూ.10 లక్షల రూపాయల ఆవు ఉదయం 8 లీటర్లు సాయంత్రం 8 లీటర్లు చొప్పున ప్రతిరోజు ఏకంగా 16 లీటర్ల వరకు పాలు ఇస్తుందట. అయితే ఆవు ఇన్ని లీటర్ల పాలు ఇవ్వడం చాలా అరుదు అని చెప్పవచ్చు.
ఈ గిర జాతి ఆవుని తాజాగా ఏపీకి చెందిన ఒక వ్యక్తి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ఆవు కోసం ఏకంగా 10 లక్షల రూపాయలు చెల్లించారు. ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలోని పెనుగొండకు చెందిన హెబ్బేవ్ గోశాల వారు ఈ ఆవుని కొనుగోలు చేశారట. సుమారుగా 10 లక్షల రూపాయల వరకు తీసుకొని ఈ ఆవుని నిన్నటి రోజున పెనుగొండ కి తరలివచ్చారు. ఇక ఈ ఆవును చూడడానికి అక్కడి ప్రజలు కూడా భారీ ఎత్తున తరలివచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఆవు గురించి సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్గా వినిపిస్తోంది.