
భారతదేశానికి సరఫరా చేసే ముడి చమురుపై ఐదు శాతం రాయితీ ఇస్తామని, రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ, క్రూడ్ ఆయిల్ ఎగుమతిని గతంలో మాదిరిగానే కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఐదు శాతం రాయితీ అన్నది ఒక స్థిరమైన మొత్తం కాదని, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ లేదా తక్కువ కూడా ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.
రష్యా నుంచి చమురు దిగుమతులు పెంచుకోవడం ద్వారా భారత్ తన ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు వీలు కలుగుతుంది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినా, భారత్ పైన దాని ప్రభావం అంతగా ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా అనేక రాజకీయ ఒత్తిడులు ఉన్నప్పటికీ, రష్యా భారత్కు మద్దతుగా నిలుస్తుండటం ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన స్నేహ బంధానికి నిదర్శనం.
ఈ రాయితీ వల్ల భారత్కు ఆర్థికంగా కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. దేశీయంగా చమురు ధరలను నియంత్రణలో ఉంచడానికి ఇది తోడ్పడుతుంది. రష్యా ఈ కీలక ప్రకటనతో, ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని భావించవచ్చు. ఈ నిర్ణయం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయేమో చూడాలి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు