బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గరపడే కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కిపోతోంది. అధికార పక్షం మరియు ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటూ, ప్రజలను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున హామీలు ఇస్తూ పోటీ పడుతున్నారు.ముఖ్యంగా, ఎవరు అధికారంలోకి వస్తే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో, ఏ మార్పులు తెస్తారో అనే అంశాలను హైలైట్ చేస్తూ అన్ని పార్టీలు ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో  తేజస్వి యాదవ్ ఇటీవల చేసిన ప్రకటన ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశమైంది.భక్తియార్‌పూర్‌లో జరిగిన భారీ ప్రజాసభలో తేజస్వి మాట్లాడుతూ, "మీరు ఒకవేళ మాకు అధికారం ఇచ్చితే, ప్రజల భారం తగ్గించేందుకు గ్యాస్ సిలిండర్ ధరను కేవలం రూ.500కే పరిమితం చేస్తాం" అని సంచలన హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యతో జనం కరతాళధ్వనులతో మార్మోగిపోయేలా చేశారు. తేజస్వి యాదవ్ ఈ ప్రకటన ద్వారా ముఖ్యంగా మధ్యతరగతి ఓటర్ల మనసు గెలుచుకోవడంలో సక్సెస్ అయ్యారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తేజస్వి మాట్లాడుతూ, “మన బీహార్ రాష్ట్రం పేద రాష్ట్రం అని నేను బీహారి గా బాధపడుతున్నాను. 20 ఏళ్లుగా ఎన్డీఏ పాలనలో రాష్ట్రం వెనుకబడి పోయింది. కేంద్రంలో 11 ఏళ్లుగా కూడా వారే అధికారంలో ఉన్నా, రాష్ట్ర తలసరి ఆదాయం ఇప్పటికీ తక్కువగానే ఉంది. రైతులు ఇంకా పేదలుగానే ఉన్నారు. నిరుద్యోగం, అవినీతి, నీరసమైన పరిపాలన — ఇవన్నీ బీహార్‌ను వెనక్కి లాగుతున్నాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇక బీహార్ ప్రజల కోసం తన పార్టీ అమలు చేయబోయే పథకాల జాబితాను కూడా ఆయన వివరించారు. పేదల కోసం కొత్త గృహ పథకాలు, రైతులకు ఉచిత విద్యుత్, వృద్ధులకు నెలకు రూ.1500 పెన్షన్, యువతకు ఉద్యోగావకాశాల కల్పన, మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు — ఇవన్నీ తేజస్వి ఇచ్చిన ప్రధాన హామీలుగా నిలిచాయి.

తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, “ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి వస్తే, నితీష్ కుమార్ సీఎం కాలేరు. ఆ కూటమిలో అంతర్గత కలహాలు, అవినీతి బహిరంగ రహస్యాలుగా మారాయి. బీహార్ ప్రజలు మార్పు కోసం సిద్ధంగా ఉన్నారు” అని బల్లగుద్ది చెప్పారు.తేజస్వి ప్రసంగం తర్వాత సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. “గ్యాస్ సిలిండర్ రూ.500కే?” అనే ట్యాగ్ లైన్ ఇప్పుడు బీహార్ పొలిటికల్ సర్కిల్‌లో ట్రెండ్ అవుతోంది. కొంతమంది ఆయన హామీలను స్వాగతిస్తుండగా, మరికొందరు అవి సాధ్యం కాని వాగ్దానాలంటూ విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికీ తేజస్వి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారు రోగిపోతోంది.

ఇలా బీహార్ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. ఒకవైపు ఎన్డీఏ అభివృద్ధి పేరుతో ప్రచారం చేస్తుంటే, మరోవైపు ఇండియా కూటమి ప్రజల మద్దతు కోసం కొత్త హామీలతో రంగంలోకి దిగింది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే —“బీహార్ ప్రజలు ఎవరికి తీర్పు ఇస్తారు?”అది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే..!


మరింత సమాచారం తెలుసుకోండి: