ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పై మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు. ప్రభుత్వం ఫీజు రిమెంబర్స్మెంట్ ని విడుదల చేయలేదని, దీనివల్ల విద్యార్థులు చదువులు మానేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు. వసతి దీవెన కింద రూ. 2,300 కోట్లు బకాయిలు పెట్టారని, ఫీజు రిమెంబర్స్మెంట్ కింద రూ.4,800 కోట్ల బకాయిలు..దీంతో మొత్తం మీద రూ .7 వేల కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ పెట్టారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోవడమే మానేసింది ఈ ప్రభుత్వం, ప్రతి పిల్లాడు సొంతగా క్యారియర్స్ తీసుకొని వెళుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వంలో అన్ని స్కాములే..బాధ్యతల నుంచి తప్పించుకోవడం కోసమే స్కాములు చేస్తున్నారని విమర్శించారు.

 అలాగే ఆరోగ్యశ్రీని కూడా ఎత్తేశారు. బకాయిల చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రులలో సేవలు కూడా ఆగిపోయాయని.. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రశ్నించడంతో రూ.1800 కోట్ల రూపాయలు ఇచ్చారు. మిగిలిన రూ.3,500 కోట్లు పెండింగ్ ఉండడంతో ఆసుపత్రి వాళ్లు  నిధులు విడుదల చేయాలని బంద్ చేశారని తెలిపారు. పేదలకు అవసరమైన ఆరోగ్యశ్రీ అంటే ఏపీలో భద్రత లేని పరిస్థితిగా మారిపోయిందని.. 104,108 కనీసం రూ .500 కోట్లు  నెట్వర్ట్ లేని సంస్థకు ఇచ్చారు. అది కూడా టిడిపి డాక్టర్ సేల్స్ అధ్యక్షుడీకే అంటూ ఫైర్ అయ్యారు.


మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ కూడా ఒక స్కామే.. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్లకు ఒక బోనంజ ఇచ్చారంటూ ఫైర్ అయ్యారు.మెడికల్ కళాశాలలు ప్రైవేట్ కరణం అయిన తర్వాత అందులో పని చేసే వారికి జీతాలు మాత్రం ప్రభుత్వం ఇస్తుందని.. ప్రభుత్వ భూమి, బిల్డింగులు, స్టాఫ్ జీతాలు అన్ని ప్రభుత్వమే కానీ ఓనర్లు మాత్రం ప్రైవేటు వాళ్లే లాభాలు కూడా ప్రైవేటు వాళ్లకే , ఈ స్కాము పై ఒక అడుగు ముందుకు వేసి చేస్తున్నారు.. ఈ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని ప్రజలు కూడా ఆందోళన చేపడుతున్నారు. ప్రైవేటీకరణం ఆపాలని కోటి సంతకాల సేకరణ చేసాము. ఈనెల 10 అన్ని జిల్లాలో ఉండే అన్ని కేంద్రాలకు పంపించి 13న అన్ని జిల్లాలలో ర్యాలీలు చేసి సెంట్రల్ ఆఫీస్ కి పంపేలా చేస్తామని తెలిపారు. అలాగే ఈ నెల 16న గవర్నర్ కి చెప్పటం , ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ కూడా వేస్తామంటూ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: