ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది మంత్రివర్గ విస్తరణ గురించే! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల గవర్నర్‌ను కలిసినప్పటి నుంచి ఈ ఉత్కంఠ మరింత పెరిగింది. రాజ్ భవన్ నిర్మాణం గురించే చర్చ జరిగిందని తెలిసి ఆశావహులు నిట్టూర్చినా, తెర వెనుక మాత్రం మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతున్నట్లు పక్కా సమాచారం! కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు కావస్తున్న నేపథ్యంలో, సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఉన్న కొందరు మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మంత్రులు 'రెడ్డి' లిస్ట్‌లో ఎందుకు? సీఎం అసంతృప్తికి ప్రధానంగా మూడు బలమైన కారణాలు ఉన్నాయి:
 

ప్రతిపక్షానికి కౌంటర్ లేదు: వైఎస్సార్సీపీ విమర్శలకు, ఆరోపణలకు కొందరు మంత్రులు బలమైన కౌంటర్లు ఇవ్వడంలో పూర్తిగా వెనకబడుతున్నారు. 'నామ్ కే వాస్తే' మంత్రులుగా ఉండటంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పీఏల తలనొప్పి: కొందరు మంత్రుల కుటుంబ సభ్యులు, పర్సనల్ అసిస్టెంట్‌ల (PAs) వ్యవహారాలు పార్టీకి, ప్రభుత్వానికి తలవంపులు తెస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శాఖపై పట్టు లేదు: రెండేళ్లు గడిచినా చాలా మంది మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకోలేకపోయారు. కేవలం కార్యాలయానికే పరిమితం అవుతున్నారనే నివేదికలు సీఎం వద్దకు చేరాయి. బలమైన గొంతుకల కోసం వేట! మరో మూడు సంవత్సరాల్లో ఎన్నికలకు వెళ్లాల్సిన తరుణంలో, బలమైన గొంతుకలకు అవకాశం ఇవ్వాలన్నది చంద్రబాబు ప్రణాళిక.



ఇక‌ గతంలో సీనియర్లకే పరిమితమైన కేబినెట్‌లో, ఈసారి సామాజికవర్గాలు, ప్రాంతాలు, జిల్లా సమీకరణాల ఆధారంగా కొత్త వారికి అవకాశాలు దక్కనున్నాయి. కొత్త ఏడాదిలో సీనియర్‌ నేతలతో పాటు, తొలిసారి గెలిచిన జూనియర్లలో సమర్థత ఉన్నవారిని కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలకు అధిష్టానం నుంచి సంకేతాలు అందడంతో, వారు ఇప్పుడు ఆ శుభ ముహూర్తం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మంత్రి పదవులు కోల్పోతారనే భయంతో సిట్టింగ్ మంత్రులు, ఎప్పుడెప్పుడు కొత్త అవకాశం వస్తుందా అని ఆశావహులు.. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో 'మంత్రి' పదవుల సస్పెన్స్ పతాక స్థాయికి చేరింది. త్వరలోనే చంద్రబాబు తుది నిర్ణయంతో ఎవరి తలరాత మారుతుందో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: