ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టక  ముందు వరకు కూడా అటు ఉత్తరప్రదేశ్ అంటే నేర చరిత్రకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది అన్న విషయం తెలిసిందే. ఇక అక్కడ నేరస్తులు శాంతి భద్రతలకు విఘాతం   కలిగిస్తూ ఎప్పుడు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో అప్పటినుంచి ఆ రాష్ట్రంలో పరిస్థితులు క్రమక్రమంగా మారుతూ వస్తూ ఉన్నాయి అని చెప్పాలి.



 ఒకవైపు రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపడుతూనే... ఇక మరోవైపు ఇక రాష్ట్రంలో ఉన్న నేరగాళ్ల ఆటలకు అడ్డుకట్ట వేస్తూ వచ్చారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్. ఒక రకంగా చెప్పాలంటే ఇక నేరాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న అందరికీ కూడా సింహ స్వప్నంలా మారిపోయాడు. యోగి ఆదిత్యనాథ్ పేరు వినిపిస్తే చాలు యూపీలోని పెద్ద పెద్ద గ్యాంగ్ స్టర్లు సైతం వనికి పోయే విధంగా ఎన్కౌంటర్లు చేస్తూ వచ్చాడు అని చెప్పాలి. ఇలా ఇప్పటివరకు యోగి ముఖ్యమంత్రిగా మారిన తర్వాత ఎంతోమంది గ్యాంగ్ స్టర్లను ఎన్కౌంటర్లు చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.



 ఇక ఇలాంటి ఎన్కౌంటర్లు చూసిన తర్వాత యోగి సర్కార్ క్రిమినల్స్ పై ఉక్కు పాదం మోపుతుంది అన్నది మాత్రం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. 2017 నుంచి ఇప్పటివరకు ఏకంగా 178 మంది క్రిమినల్స్ ను యూపీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు అంటే అక్కడ క్రిమినల్స్ వేరువేత ఎలా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. గత ఆరేళ్లలో 13 రోజులకు ఒక క్రిమినల్ చొప్పున హతమైనట్లు పోలీసుల లెక్కలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ ఆరేళ్లలో 23069 మంది నేరస్తులను అరెస్టు చేశారు యూపీ పోలీసులు. ఇటీవల గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్  కుమారుడు అసద్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: