సాధారణం గా టి20 ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ల విధ్వంసానికి మారుపేరు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే టి20 ఫార్మాట్ ను ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక మ్యాచ్ ఫలితం కోసం రోజుల తరబడి  వేచి చూడాల్సి పని ఉండదు. కేవలం గంటల వ్యవధి లోనే విజేత ఎవరు అన్నది తేలిపోతూ ఉంటుంది. అయితే టి20 ఫార్మాట్లో అటు ప్రేక్షకులకు కావలసిన ఉత్కంఠ కూడా ఉంటుంది అని చెప్పాలి.



 ఇక బ్యాట్స్మెన్లు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడుతూ భారీగా పరుగులు చేస్తూ ఉంటారు. దీంతో కేవలం 120 బంతుల్లో కొన్ని కొన్ని సార్లు 200 లకు పైగా  పరుగులు చేసిన సందర్భాలు అంతర్జాతీయ క్రికెట్లో చాలానే ఉన్నాయి. అదే సమయం లో ఒక్కోసారి అటు బ్యాటింగ్ విభాగం మొత్తం పేక మేడలా కుప్ప కూలిపోయి అతి తక్కువ పరుగులకే పరిమితమైన సంఘటనలు ఉన్నాయి. అయితే ఇలా తక్కువ పరుగులు చేసిన జట్టు ఎప్పుడైనా ఓడి పోతుంది అని అందరూ అనుకుంటారు.



 కానీ తక్కువ పరుగులు చేసిన ఇక పట్టుదలతో పోరాడితే మాత్రం విజయం సాధించవచ్చు అని ఇటీవల నిరూపించారు కొంతమంది ప్లేయర్లు. ఈ క్రమంలోనే మహిళల టీ20 క్రికెట్ చరిత్రలోనే థాయిలాండ్ టీం రికార్డు సృష్టించింది. అతి తక్కువ లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా నిలిచింది.థాయిలాండ్, మలేషియా మధ్య ఇటీవల జరిగిన టి20 మ్యాచ్ లో థాయిలాండ్ జట్టు 50 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో 54 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా 41 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో 12 పరుగుల తేడాతో విజయం సాధించింది థాయిలాండ్. కాగా 2012లో శ్రీలంక బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో 63 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని విజయం సాధించింది బంగ్లా టీం.

మరింత సమాచారం తెలుసుకోండి: