ప్రస్తుతం భారత క్రికెట్ మొత్తంలో కూడా ఒకటే చర్చ జరుగుతుంది. అదే తర్వాత కెప్టెన్ ఎవరు అని.. కొంతమంది అటుకోహ్లీ తర్వాత భారత టీ20 కెప్టెన్ ఎవరు కాబోతున్నారు అనే దానిపై చర్చ జరుగుతూ ఉండగా.. అటు ఐపీఎల్ లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు  జట్టు కెప్టెన్గా తప్పుకుంటున్నా అంటూ కోహ్లీ ప్రకటించడంతో.. ఇక ఈ జట్టు కొత్త కెప్టెన్ గా ఎవరు కాబోతున్నారు అన్నదానిపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే టీమ్ ఇండియా టి20 కెప్టెన్గా  రోహిత్ శర్మ కన్ఫార్మ్ అయిపోయాడు అంటూ అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ అటు ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  జట్టుకు మొదటినుంచి విరాట్ కోహ్లీ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు.


 మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ తర్వాత కొత్త కెప్టెన్ గా ఎవరు రాబోతున్నారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇప్పటికీ ఐపీఎల్ లోకి కొత్తగా రెండు జట్లు ఎంట్రీ ఇచ్చాయి. అయితే  ఈ రెండు జట్ల  కోసం మెగా వేల నిర్వహించడానికి బీసీసీఐ నిర్ణయించింది. దీంతో ఇక ఆర్సిబి జట్టుకు కొత్త కెప్టెన్  ఎవరు రాబోతున్నారు అన్నది మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక కోహ్లీ కెప్టెన్సీకి స్వస్తి పలకడం తో అటు కొత్త కెప్టెన్ కోసం యాజమాన్యం కూడా వేట మొదలు పెట్టింది.


 అయితే ఆర్సిబి కెప్టెన్ గా ఎవరు కాబోతున్నారు అనే చర్చలో భాగంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కె.ఎల్.రాహుల్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.  మంచి ఫాంలో కొనసాగుతున్న కె.ఎల్.రాహుల్ పంజాబ్ జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించిన ఘటనలు కూడా ఉన్నాయి.. అదిరిపోయే ఫామ్ లో దూసుకుపోతున్నాడు  కె.ఎల్.రాహుల్. అదే సమయంలో ఇక ఢిల్లీ జట్టును మునుపెన్నడూ లేని విధంగా తొలిసారి ఫైనల్కు తీసుకెళ్లిన ఘనత  శ్రేయస్ అయ్యర్ కి దక్కింది అని చెప్పాలి. దీంతో వీరిద్దరిలో ఆర్సిబి కొత్త కెప్టెన్ గా ఎవరు కాబోతున్నారు అనేది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb