ప్రస్తుతం రంజీ క్రికెట్ ట్రోఫీ జరుగుతుంది అనే విషయం తెలిసిందే. దాదాపు కరోనా వైరస్ కారణంగా రెండు సంవత్సరాల నుంచి వాయిదా పడుతూ వస్తున్న రంజీ ట్రోఫీ ప్రస్తుతం జరుగుతోంది. ఈ రంజీ ట్రోఫీ ద్వారా ఎంతో మంది యువ క్రికెటర్లు తన ఫస్ట్ క్లాసు కెరీర్ ను ప్రారంభించారు. అంతేకాకుండా ఎంతోమంది అద్భుతమైన ప్రదర్శన చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారిపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక క్రికెటర్ గురించిన వార్త తెగ వైరల్ గా మారిపోతుంది. బరోడా క్రికెటర్ విష్ణు సోలంకి రంజీ ట్రోఫీ సీజన్ లొ ఇటీవలే సెంచరీతో మెరిసి వార్తల్లో నిలిచాడు. ఇటీవల చండీగఢ్లో జరుగుతున్న మ్యాచ్లో సోలంకి ఏకంగా సెంచరీ చేసి అదరగొట్టాడు.


 ప్రతి ఆటగాడు సెంచరీ చేస్తాడు. ఇక ఇతను కూడా అలాగే చేశాడు ఇందులో కొత్తేముంది అని అనుకుంటున్నారు కదా.. కొత్త కాదు గుండెలవిసె ఒక బాధ దాగి ఉంది. విష్ణు సోలంకి సెంచరీ సాధించడం వెనుక ఒక విషాద గాధ ఉంది.  కొన్ని రోజుల క్రితమే విష్ణు సోలంకి కూతురు అనారోగ్యంతో మరణించింది. పుట్టిన కొద్ది రోజులకే ఆరోగ్య సమస్యలతో పసికందు కన్నుమూయడంతో విష్ణు సోలంకి ఎంతో బాధలో మునిగిపోయాడు. ఇక ఇలా కూతురు చనిపోయిన సమయంలో రంజీ ట్రోఫీ లో ఎంతో బిజీగా ఉన్నాడు విష్ణు సోలంకి. కూతురు చనిపోయింది ఆమె మరణవార్త అతనికి చేరగానే అతని గుండె పగిలిపోయింది.


 వెంటనే హుటాహుటిన బయలుదేరి కూతురు అంత్యక్రియలు నిర్వహించడం విశేషం. సోలంకి ఇక ఆట మీద మక్కువతో కూతురు చనిపోయింది అని బాధను దిగమింగుకుని మళ్ళీ  మైదానంలోకి  వచ్చేశాడు. వస్తు వస్తూనే  చండీఘర్ తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టాడు. ఇలా పుట్టిన బిడ్డల చనిపోయిన బాధను దిగ మింగుకుని కూడా సెంచరీతో మెరిసిన విష్ణు సోలంకి గురించి తెలిసిన తర్వాత మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారు అందరూ. ఈ క్రమంలోనే తన గురించి తెలిసిన ఎంతోమంది అతని ఆటకు సలాం అంటూ కామెంట్ లు పెడుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: