ముందుగా అనుకున్నట్లుగానే.. బిసిసిఐ ప్రకటించినట్టుగానే మార్చి 26వ తేదీన ఐపీఎల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక మొదటి మ్యాచ్లోనే చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో కోల్కతా జట్టు విజయం సాధించింది. ఇక ఆ తర్వాత సండే కావడంతో ఒకే రోజు రెండు మ్యాచ్లు జరిగాయ్. దీంతో ఇక క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఉర్రూతలూగి పోయారు అని చెప్పాలి. అయితే ఐపీఎల్  మార్చి 26వ తేదీన ప్రారంభం అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా అసలు సిసలైన ఎంటర్ టైన్మెంట్స్ షురూ అయ్యేది మాత్రం నేటి నుంచి అని చెప్పాలి. ఎందుకంటే తెలుగు ప్రేక్షకుల జట్టుగా కొనసాగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ లో భాగంగా నేడు తొలి మ్యాచ్ ఆడబోతు ఉంది.


 గత కొన్ని సీజన్ల నుంచి పేలవ ప్రదర్శన చేస్తూ అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఇక ఇలా నిరాశపరిచినప్పుడల్లా జట్టులో మార్పులు కావాలి అంటూ అభిమానులు డిమాండ్ చేశారు.ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన మెగా వేలంలో ఎంతో మంది కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. దీంతో ఈ సారి మిగతా జట్ల లాగానే సన్రైజర్స్ కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది అని చెప్పాలి. ఇక కేన్ విలియమ్సన్ జట్టులోకి వచ్చిన కొత్త ఆటగాళ్లను ఉపయోగించుకుంటూ ఎలా జట్టుకు విజయం అందించబోతున్నాడు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఇకపోతే 2022 సీజన్ ఐపీఎల్ లో భాగంగా నేడు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదటి మ్యాచ్ ఆడబోతుంది. ఇక మొదటి మ్యాచ్లో భాగంగా అటు రాజస్థాన్ రాయల్స్ జట్టు తో తలపడుతుంది. అయితే గత ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో ఇక ఈ రెండు జట్లు కూడా తీవ్రంగా నిరాశ పరిచాయి. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచాయి ఈ రెండు జట్లు. మరి ఈసారి ఎలా ప్రదర్శన కొనసాగిస్తాయి అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే రాజస్థాన్ సన్రైజర్స్ మధ్య ఇప్పటి వరకు 15 మ్యాచ్ లు జరగగా ఇందులో సన్రైజర్స్ 8 రాజస్థాన్ 7 మ్యాచ్లలో విజయం సాధించాయి. ఇక సన్రైజర్స్ భోణి కొట్టాలని తెలుగు ప్రేక్షకులందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl