ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా ఒకే విషయం గురించి చర్చ జరుగుతుంది. నవంబర్ 19వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోయే.. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఎవరు విజేతగా నిలుస్తారనే విషయంపై. అయితే పుష్కరకాలం తర్వాత ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో ఇక 2011 మ్యాజిక్ కు టీమిండియా మరోసారి రిపీట్ చేస్తుందని తప్పకుండా వరల్డ్ కప్ టైటిల్ విజేతగా నిలుస్తుంది అని అభిమానులందరూ కూడా భావిస్తూ ఉన్నారు.


 అయితే ఈ వరల్డ్ కప్ లో భాగంగా మొదటి లీగ్ మ్యాచ్ నుంచే ఎంతో దూకుడు చూపిస్తూ ఉంది టీమిండియా. లీగ్ దశలో 9 మ్యాచ్లలో ఇక సెమి ఫైనల్ ఒక మ్యాచ్లో గెలిచి మొత్తంగా ఇప్పటివరకు ఆడిన పది మ్యాచ్ లలో పదింట విజయం సాధించింది టీమ్ ఇండియా  దీంతో ఫైనల్లో కూడా ఘన విజయాన్ని అందుకొని చరిత్ర సృష్టించాలని భావిస్తుంది. అయితే ఇక భారత అభిమానులు అందరిలో కూడా టీమిండియాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి అని చెప్పాలి. ఈ అంచనాలు ఇక భారత జట్టును ఒత్తిడిలోకి నేడతాయ్ అనడంలో సందేహం లేదు. ఇదిలా ఉంటే 2011 వరల్డ్ కప్ ఫైనల్ గెలిచిన నాటి క్షణాలను ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు గుర్తు చేసుకుంటున్నారు.


 ఈ క్రమంలోనే సోషల్ మీడియా  ఓపెన్ చేస్తే చాలు ఎన్నో రకాల పోస్టులు వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే ధోని కెప్టెన్సీలో భారత జట్టు 2011 వరల్డ్ కప్ ఫైనల్ లో శ్రీలంక పై విజయం సాధించి టైటిల్ గెలిచింది. దీంతో ఇండియా లిఫ్ట్ ద వరల్డ్ కప్.. ఆఫ్టర్ 28 ఇయర్స్ అని అప్పుడు వ్యాఖ్యాతగా ఉన్న రవి శాస్త్రి చెప్పిన కామెంట్రీ ఎప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. అయితే ఇక ఇప్పుడు నవంబర్ 19న ఆదివారం రాత్రి మనం గెలుస్తాం. ఇక రవి శాస్త్రి తన గంభీరమైన గొంతుతో 12 ఏళ్ల తర్వాత.. ఇండియా లిఫ్ట్ ద వరల్డ్ కప్ అని చెబితే ఎంత బాగుంటుంది అని అందరూ కామెంట్లు చేస్తుండగా.. ఈ ఊహ ఎంత బాగుందో అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc