![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/sports/libra_libra/cricket-2f9868c7-0b39-4107-a371-d74a14db7d51-415x250.jpg)
అయితే కొన్ని నెలల క్రితమే రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ పదవీకాలం ముగిసింది. ఇక రెండోసారి కూడా ఆయననే కోచ్గా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. కానీ మొదటిసారి కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకే అతి కష్టం మీద ఒప్పుకున్న రాహుల్ ద్రావిడ్ ఇక రెండోసారి మాత్రం ఈ ఆ పదవిలో కొనసాగేందుకు ఇష్టపడలేదు. ఈ క్రమంలోనే బీసీసీఐ పెద్దలకు రాహుల్ ద్రావిడ్ స్థానంలో కొత్త కోచ్ ను వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే బీసీసీఐకి కొత్త కోచ్ కావాలి అంటూ ఇటీవల అటు ప్రకటన కూడా విడుదల చేశారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రికీ పాంటింగ్, గౌతమ్ గంభీర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ అంటూ చాలామంది హెడ్ కోచ్గా రాబోతున్నారు అంటూ పేర్లు వినిపిస్తున్నాయి.
అయితే ఇటీవల టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ప్రకటన విడుదల చేసినప్పటికీ ఇక కోచ్ కి ఇవ్వబోయే జీతం ఎంత ఉంటుంది అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే వేతనం గురించి చర్చించుకోవచ్చు అని.. అనుభవం ఆధారంగానే వేతనాన్ని నిర్ణయిస్తాము అంటూ తెలిపింది. కాగా ప్రస్తుతం కోచ్గా ఉన్న రాహుల్ ద్రావిడ్ కు బిసిసిఐ ఏడాదికి 12 కోట్ల రూపాయలు చెల్లిస్తోందట. ఇక ద్రావిడ్ కంటే ముందు అటు కోచ్గా వ్యవహరించిన రవి శాస్త్రికి ఏడాదికి 8 కోట్ల రూపాయలు చెల్లించిందట బీసీసీఐ. ఈ క్రమంలోనే ఈ లెక్కన చూసుకుంటే ఈసారి టీమిండియా కు కోచ్ గా వ్యవహరించే వ్యక్తికి భారీ మొత్తంలోనే చెల్లించే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.