ప్రముఖ నటి యాంకర్ అనిత చౌదరి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. కొన్నేళ్ల క్రితం వరుసగా పలు సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న ఈమె ఈ మధ్యకాలంలో పెద్దగా కనిపించలేదు. ఈమె నటించిన చిత్రాలలో ఉయ్యాల జంపాల ,చత్రపతి తదితర సినిమాలలో మంచి నటిగా గుర్తింపు పొందింది. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. అనిత చౌదరి మాట్లాడుతూ.. కస్తూరి సీరియల్ కోసం తొలిప్రేమ సినిమా లో అవకాశం వదులుకున్నానని తెలియజేస్తోంది. కస్తూరి ఫస్ట్ డైలీ సీరియల్ అని కామెంట్స్ చేసింది అనిత చౌదరి.



నేను వదులుకున్న మంచి సినిమాలు చాలానే ఉన్నాయంటూ తెలియజేస్తోంది.నేను ఫ్యామిలీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాను తెలియజేస్తోంది.. మనకు రాసి పెట్టిందంటే మనకే దక్కుతుందని అనిత చౌదరి తెలియజేయడం గమనార్హం. హీరోయిన్గా చాలానే అవకాశాలు వచ్చాయని కానీ చేజేతులారా అవన్నీ వదులుకోవాల్సి వచ్చిందని తెలియజేస్తోంది. కొత్త ప్రాజెక్టులు తన దగ్గరకు చాలానే వచ్చాయని కొత్త హీరోలు అనే ట్రెండ్ అప్పట్లో ఎక్కువగా లేదంటూ తెలియజేస్తోంది. తనకు మంచి రోజు వచ్చాయని ఇప్పుడు మాత్రం అంతగా అవకాశాలు రాలేదని.. కానీ అవకాశాలు ఇవ్వాలని అడుగుతున్నానని అనిత తెలియజేస్తోంది.


కృష్ణవంశీ గారి ఛాన్స్ ఇవ్వాలని అడిగానని నా జీవితంలో అన్ని రోజులు ఉన్నాయని అనిత చౌదరి తెలుపుతోంది. ప్రస్తుతం అనిత చౌదరి చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. గతంలో ఏఎన్ఆర్ గారు తనకి తమ తోట నుంచి జామకాయలు తెచ్చి ఇచ్చేవారని తెలియజేస్తోంది. టీచరుగా కూడా ఆమె పనిచేశానని నాగార్జున గారు తన పైన పంచులు వేసే వారిని తెలియజేస్తోంది. ఇక బాలయ్య, చిరంజీవి అంటే సినిమాలలో అవకాశాలు ఇవ్వాలి అంటూ కోరుకుంటున్నారని తెలియజేస్తోంది. పవన్ , మహేశ్ సినిమాలో కూడా అవకాశం వస్తే బాగుంటుందని తెలియజేస్తోంది అనిత చౌదరి.

మరింత సమాచారం తెలుసుకోండి: