వేసవి కాలం వచ్చింది అంటే చాలా మందికి గుండెల్లో వణుకు పుడుతుంది. భగ్గుమంటున్న ఎండలు ఒకవైపు, మరో వైపు ఉక్క పోత వల్ల జనాలకు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది.ప్రస్తుతం సమ్మర్ సీజన్ కాబట్టి ఎండలు మండి పోతున్నాయి. దేశంలో ని పలు చోట్ల ఉష్ణోగ్రత దాదాపు ప్రతి రోజూ 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఎండలు పెరిగి పోతున్నాయి. ఒకవేళ అంతో ఇంతో గాలి తగులుతుంది అనుకుంటే అది కూడా చాలా వేడిగా తగులుతూ ప్రజలను భయాందొలనకు గురి చేస్తున్నాయి.


ఎండలు వుంటే ఉండని కానీ, ప్రశాంతంగా ఉందాము అనుకుంటే మాత్రం అది తప్పే.. కరెంట్ నిల్వలు లేవని,ఎండలు ఎక్కువ అవ్వడంతో నీళ్ళు కూడా తగ్గిపోయాయని ఏవేవో సాకులు చెప్పి కరెంట్ కోతలు కూడా ఎక్కువగానే తీస్తున్నారు.. దాంతో జనాలు ఇక్కట్లు పడుతున్నారు.. మధ్యాహ్నం పూట అయితే ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. కరెంటు లేకపోవడం, ఎండ వేడిమితో వేసవిలో చల్లగా ఉండేందుకు ప్రజలు చాలా మార్గాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తెలివైన ఆలోచన చేశాడు. ఉక్కపోత తట్టుకోలేక తన చేతుల తో ఎలక్ట్రిక్ టేబుల్ ఫ్యాన్‌కు ఉండే రెక్కల ను వీలైనంత గట్టిగా తిప్పి మంచం పై పడుకున్నాడు.


 ఫ్యాన్ ఆగిపోయిన తర్వాత.. ఆ వ్యక్తి లేచి మళ్లీ రెక్కలను తిప్పి పడుకుంటాడు.. అలా ఆ వ్యక్తి కరెంట్ వచ్చే వరకూ చేస్తూ వస్తున్నాడు. అతను చేస్తున్నప్పుడు ఎవరో ఈ దృశ్యాన్ని వీడియో తీసారు.ఆ వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తుంది. 4.36 లక్షల వ్యూస్ మరియు 14 వేల లైక్‌లు వచ్చాయి.. అతను చేస్తున్న పని చూసి అందరు కడుపుబ్బా నవ్వుకున్నారు. ఒకసారి ఆ వ్యక్తి ఎంత తెలివి గా చేశాడో మీరు కూడా ఆ వీడియోను చూడండి.. వీలైతే ఓ కామెంట్ వేసుకోండి..





మరింత సమాచారం తెలుసుకోండి: