ఇందుకు సంభంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.తమిళనాడు పెరూ సమీపంలోని వడివేలంపాళయం గ్రామానికి చెందిన కమలతాల్ అనే వృద్ధురాలు ఇడ్లీ అమ్మగా పాపురల్ అయ్యారు. సుమారు 37 ఏళ్లుగా సాంబార్, చట్నీతో కూడిన ఇడ్లీలను కేవలం రూపాయికే ఆమె విక్రయిన్నది. తెల్లవారుజాము నుంచే ఇడ్లీ తయారీ పనుల్లో నిమగ్నమవుతుంది. పేదలకు, కూలీలకు ఒక్క రుపాయికి ఇడ్లీ లను అందిస్తూ ఆకలిని తీరుస్తుంది.ఇడ్లీ అమ్మ కమలతాల్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది ఆనంద్ మహీంద్రా దృష్టికి వెళ్లింది. దీంతో ఇడ్లీ అమ్మకు తాను మద్దతిస్తానని, ఆమె వ్యాపారంలో పెట్టుబడి పెడతానని 2019లో ట్వీట్ చేశారు.
అలాగే పేదలకు మరింతగా సేవ చేసేందుకు ఇడ్లీ అమ్మకు త్వరలో కొత్త ఇంటిని సమకూర్చుతానని 2021 ఏప్రిల్లో మరో ట్వీట్ చేశారు. ఆదివారం మదర్స్ డే సందర్భంగా ఆ హామీని నెరవేర్చారు. ఆయన సంస్థ సిబ్బంది కమలతాల్కు కొత్త ఇంటిని అందించారు. మదర్స్ డే సందర్భంగా ఆమెకు ఇల్లును ఇవ్వడం పై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఆమెకు, ఆమె పనికి మద్దతివ్వడం ఒక ప్రత్యేకత. అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు' కూడా తెలిపారు..ఈ ట్వీట్ కు నెటిజన్లు ఫిదా అవుతూన్నారు.అతడు చేసిన మంచి పనికి హ్యాట్సాప్ చెబుతున్నారు.