నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లను జారీ చేస్తూనే ఉంది కేంద్ర ప్రభుత్వం.. రైల్వేలో భారీగా ఉద్యోగ అవకాశాలను విడుదల చేయడం జరిగింది.. ఇటీవలే గ్రూప్-D ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలను విడుదల చేసింది.. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్వే రిక్రూమెంట్ సెల్ అధికారిక ప్రకటన విడుదల చేయడం జరిగింది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన గత ఏడాది ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలను కూడా విడుదల చేసింది అర్హత సాధించిన అభ్యర్థులను.. జనవరి 12 నుంచి 22 వరకు ఫిజికల్ ఎఫిషియన్ టెస్ట్ నిర్వహించారు.


ఏడాది ఫిబ్రవరి 7 నుంచి 13 వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తి చేయడం జరిగింది.ఇలా అన్నిటిలో కూడా అర్హత సాధించిన వారు కేవలం 7,305 మంది ఉన్నట్లుగా తెలియజేశారు. వీరికి సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేయడం జరిగింది.. స్టోర్, డీజిల్ , ఎలక్ట్రికల్ వర్క్ షాప్ తదితర విభాగాలలో అసిస్టెంట్ అసిస్టెంట్ లోకో పైలట్ తదితర పోస్టులు ఉన్నాయి. దాదాపుగా 9,000 కు పైగా ఖాళీలతో 2019లో ఈ గ్రూప్ -D నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

కాక ఇటీవల కేంద్రప్రభుత్వం రైల్వేలో దాదాపుగా రెండు లక్షలకు పైగా ఖాళీలు ఉన్నట్లు ప్రకటించడం జరిగింది అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.. వీటితోపాటు గ్రూప్ డి పోస్ట్ లు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలియజేసింది. ఇందులో కూడా మొత్తం పదివేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు వీటితోపాటు జూనియర్ ఇంజనీర్, సీనియర్ ఇంజనీర్ నాన్ టెక్నికల్, అసిస్టెంట్ లోకో పైలట్ తదితర పోస్టులు కూడా ఉన్నట్లు తెలియజేశారు. వీటిలో ఎక్కువగా గ్రూప్ డి పోస్టులే అధికంగా ఉన్నట్లు తెలిపారు. రైల్వేలో వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు ఇటీవల అధికారులు కూడా తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: