మొన్నటి వరకు అదే పార్టీలో ఉండి ఇప్పుడు వ్యక్తిగత స్వలాభాల కోసం విమర్శలు చేయడం జుబుప్సాకరం అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ఒకరిద్దరు మహిళ ఎమ్మెల్యేలు చాలా అసభ్యంగా చంద్రబాబు నాయుడు పై విమర్శలు చేస్తున్నారు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. వారి మాటలు వింటే మిము మహిళలమేనా అన్న సందేశం కలుగుతుంది అని అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం అని వ్యక్తిగత విలువలు కాపాడుకోవాలి సూచించారు.

ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న చాలామంది నేతలు ఒకప్పుడు తెలుగుదేశం లో ఉన్నవారే అని స్పష్టం చేసారు. ఎన్టీఆర్ ఎపిసోడ్ గురించి పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నవారు. అది జరిగిన తరువాతే బాబు గారితో చేరి పదవులు తెచ్చుకున్నారు అని భువనేశ్వరి గారి క్యారెక్టర్ దిగజార్చే విదంగా మాట్లాడటం సరికాదు అని సూచించారు. వాళ్ల ఇళ్ళల్లో కూడామహిళలు ఉన్నారు అన్నారు ఆమె.

మరింత సమాచారం తెలుసుకోండి: