తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఎవరిని నియమిస్తారాన్నదానిపై   ఉత్కంఠత కొనసాగుతూనే ఉంది. నిజానికి సాగర్ ఉప ఎన్నికలకు ముందే ప్రకటన వస్తుందని భావించినా ఎన్నికల కారణంగా నియామకాన్ని వాయిదా వేశారు. ఇక ఇప్పుడు మరోసారి పీసీసీ అంశం తెరపైకి రావడంతో ఆశావహులు అంతా ఢిల్లీ బాట పట్టారు.

పీసీసీ పదవిని ఆశిస్తున్న రేవంత్ రెడ్డి, మధుయాష్కి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, భట్టి విక్రమార్క ఢిల్లీకి భయలుదేరారు.దాంతో రేపో మాపో ప్రకటన వస్తుందని అంతా భావించారు. అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు పార్టీ అధిష్టానానికి లేఖ రాయడం అదక్తింటేపుతోంది. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ను నిర్ణయించడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పరిశీలకులను పంపాలని విహెచ్ లేఖలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: