వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే సిఎం వైఎస్ జగన్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా ఈ విమర్శలు తీవ్ర దుమారం రేపుతూనే ఉన్నాయి. ఇక పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా రఘురామ కృష్ణం రాజ్జు కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఒక ఘటన చోటు చేసుకుంది.

పార్లమెంటు ఆవరణలో తనను ఎంపీ గోరంట్ల మాధవ్  దుర్భాషలాడారు అని రఘురామ రాజు  ఫిర్యాదు చేసారు. సిఎం వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ లు ఆపకపోతే మాత్రం కచ్చితంగా అంతం చేస్తామని ఎంపీ గోరంట్ల మాధవ్ తనను బెదిరించారని రఘురామ ఆరోపించారు. స్పీకర్ ఓం బిర్లా కు ఈ మేరకు ఆయన ఫిర్యాదు చేసారు. తనను బెదిరించిన ఎంపీ మీద చర్యలు తీసుకోవాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: