ప్రభుత్వం తీరుతో... రేషన్ షాపుల బంద్ కు పిలుపునిచ్చారు రేషన్ డీలర్ల అసోసియేషన్ నేతలు. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి రేషన్ పంపిణీ నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసారు. 2020 పియంజికెఎవై కమీషన్ బకాయిలు ఇవ్వాలి అని డిమాండ్ చేసారు. డీలర్ల నుండి ఐసిడిస్ కు మళ్ళించిన కందిపప్పు డబ్బు తక్షణమే చెల్లించాలి అని గోనె సంచులను ప్రభుత్వానికి ఇస్తే 20 రూపాయలు ఇస్తామని సర్క్యులర్ ఇచ్చారు అని పేర్కొన్నారు.

 ఇప్పుడు చెల్లింపు చేయబోమని  చెప్పడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. గోనెసంచులు ఇవ్వకుంటే ఎలాట్మెంట్ కట్ చేస్తామని అని అధికారులతో కేస్ లు పెడతామని హెచ్చరించడం తగదు అన్నారు. గోనెసంచులు ప్రభుత్వం తీసుకునేలా ఇచ్చిన జీవో 10 పక్క రాష్ట్రం తెలంగాణలో అమలు చేస్తున్నారు అని తెలిపారు. మన  రాష్ట్రంలో కూడా  నిలుపుదల చేయకుండా అమలు చేయాలి అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap