మరోసారి తెలంగాణ విద్యాశాఖ అధికారులు తమ నిర్లక్ష్యం ప్రదర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాల్లో నిన్నటి నుంచి కుండపోతగా వర్షాలు కురుస్తుంటే పట్టించుకోని అధికారులు.. ఇవాళ స్కూళ్లు ప్రారంభం అయ్యాక.. సెలవు ఇస్తున్నామని ప్రకటించారు. గతంలోనూ ఇదే తరహాలో వ్యవహరించి అభాసుపాలయ్యారు. అయినా సరే మళ్లీ అదే నిర్లక్ష్యం ప్రదర్శించారు.

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు అధికారులు ఆలస్యంగా  సెలవు ప్రకటించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌ జిల్లాల్లో పాఠశాలకు సెలవు ఇచ్చారు. పలు జిల్లాల్లో ఇవాళ కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. అలాగే హైదరాబాద్‌, మెదక్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్ హెచ్చరిక జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: