ప్రతి అయిదు అసెంబ్లీ నియోజక వర్గాలకు ఒక నాయకుడిని లెక్కన 119 నియోజక వర్గాలకు రేవంత్ రెడ్డి బాధ్యుడుగా నియమించారు. అందులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నారు. వీరితో పాటు జానారెడ్డి, దామోదర్ రాజనర్సింహ, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎంపీ అంజన్కుమార్, అజారుద్దీన్, సుదర్శన్ రెడ్డి, మధుయాస్కీ, ప్రేమసాగర్ రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి వంటి వారు కూడా శాసనసభ నియోజక వర్గాలల్లో సమీక్షలు చేస్తారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి