ఇటీవల కాలంలో బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వని మనుషులు.. దారుణంగా ప్రవర్తిస్తున్న తీరు చూస్తే మాత్రం సభ్య సమాజం మొత్తం ఉలిక్కి పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పాలి.  ముఖ్యంగా తప్పు అని తెలిసినప్పటికీ ఎంతో మంది కట్టుకున్న వారిని మోసం చేస్తూ పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి ఇక ఎన్నో దారుణాలు చేయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. ఏకంగా కష్టసుఖాల్లో తోడుంటామని ప్రమాణం చేసిన వారే కట్టుకున్న వారిని దారుణంగా హత మారుస్తున్న ఘటనలు నేటి రోజుల్లో కోకొల్లలుగా  వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా భర్త సోదరుడితో వివాహేతర సంబంధానికి తెరలేపిన  మహిళ చివరికి తమ సుఖానికి భర్త అడ్డు వస్తున్నాడు అని భావించి దారుణానికి ఓడి గట్టింది. ప్రియుడుతో కలిసి ఏకంగా కట్టుకున్న భర్తని అతి కిరాతకంగా చంపేసింది. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా  మృతదేహాన్ని ఇంటి ముందు ఉన్న గడ్డివాములో దాచి పెట్టింది. ఇక ఏడాదిన్నర పాటు గడ్డివాములోనే మృతదేహాన్ని ఉంచింది. ఇక ఎవరికీ అనుమానం రాలేదు. ఆ తర్వాత ఆస్తిపంజరాన్ని తీసుకెళ్లి అడవిలో పడేసింది. ఇక చివరికి ఆ అస్తిపంజరమే పోలీసులకు ఆ మహిళను పట్టించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలో వెలుగు చూసింది. రామ్ సుశీల్ అనే 40 ఏళ్ల వ్యక్తి పదేళ్ల క్రితం రంజన అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి పిల్లలు లేరు. అయితే సాఫీగా సాగిపోతున్న వీరి సంసారంలో అక్రమ సంబంధం చిచ్చు పెట్టింది. సుశీల్ సోదరుడు గులాబ్ తో రంజన వివాహేతర సంబంధానికి తెరలేపింది. ఓ రోజు ఈ విషయం తెలిసి సుశీల్ భార్యను నిలదీసాడు. దీంతో వారి సుఖానికి భర్త అటు వస్తున్నాడని ఇక అతని చంపేయాలని నిర్ణయించుకుంది భార్య. ఈ క్రమంలోనే ప్రియుడు గులాబ్ తో కలిసి ప్లాన్ వేసింది. ఏకంగా సమోసాలో ఎలకల మందు కలిపి అతని చేత తినిపించడంతో  మృతి చెందాడు. ఇక ఇంటి ముందు ఉన్న గడ్డివాము మధ్యలో మృతదేహాన్ని ఏడాదిన్నర పాటు దాచి  తర్వాత అస్తిపంజరాన్ని అడవిలో పడేసింది. కానీ కొంతమంది స్థానికులు అస్తిపంజరాన్ని  గురించి పోలీసులకు సమాచారం అందించగా.. ఇక డీఎన్ఏ టెస్ట్ లో అసలు విషయం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: