ఇక ఇటీవల బీహార్ లోని సరం జిల్లాలో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వివాహిత ఏకంగా కుటుంబాన్ని పిల్లలను వదిలేసి ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పెళ్లికి ముందు ఓ యువకుడిని ప్రేమించింది యువతి. అయితే పెద్దలు మాత్రం అతనితో పెళ్లికి అంగీకరించలేదు. ఇక వేరొకరితో పెళ్లి జరిపించారు. ఆ సమయంలో సైలెంట్ గానే ఉన్న యువతి పెళ్లి తర్వాత కూడా రహస్యంగా యువకుడితో ప్రేమాయణం నడపడం మొదలుపెట్టింది.
ఇటీవలే మరింత బరితెగించి.. ఏకంగా ప్రేమికుడిని అత్తింటికి పిలిపించుకొని మరి గదిలో ఏకాంతంగా గడపాలి అని అనుకుంది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరు లేని సమయంలో పిలిచింది. అయితే అంతలోనే ఇంట్లోకి అత్తమామలు ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ జరుగుతుంది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏకంగా సదరు యువకుడిని తీవ్రంగా కొట్టి గ్రామ పెద్దల ముందు నిలబెట్టారు. ఈ క్రమంలోనే గ్రామ పెద్దలు ఆ యువతి యువకులు ఇద్దరికీ కూడా పెళ్లి చేశారు. పునీత అనే మహిళకు ఆమ్రేష్ కుమార్ తో మూడేళ్ల క్రితం వివాహం జరగగా పెళ్లికి ముందు ఆమెకు ఒక యువకుడితో పరిచయం ఉండగా అతనితో పెళ్లి తర్వాత కూడా ప్రేమాయణం నడిపింది. ఇక ఓ రోజు ఇంట్లో ఏకాంతంగా గడిపేందుకు ప్రియుడిని పిలువగా అత్తమామలకు దొరికేశారు. దీంతో ఇక ఊర్లో పెద్దలు చర్చించుకుని ఆ ప్రేమికులందరికీ పెళ్లి చేశారు.