పెళ్లి ఏ సాంప్రదాయం ప్రకారం జరిగిన.. కొత్తగా దాంపత్య బంధం లోకి అడుగుపెట్టే యువతి యువకులు ఇద్దరు కూడా కలకాలం పాటు ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ కలిసి ఉండాలని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. ఎలాంటి సమస్య వచ్చినా ఒకరికి ఒకరు అండగా ఉండాలని అనుకుంటారు. కానీ ఇటీవల కాలంలో భార్యాభర్తలు మాత్రం ఏకంగా కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వకుండా పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి అక్రమ సంబంధాలకు తెర లేపుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇలా అక్రమ సంబంధాల కారణంగా నేటి రోజులు హత్యలు ఆత్మహత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి అని చెప్పాలి.

 ఇక ఇటీవల బీహార్ లోని సరం జిల్లాలో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వివాహిత ఏకంగా కుటుంబాన్ని పిల్లలను వదిలేసి ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పెళ్లికి ముందు ఓ యువకుడిని ప్రేమించింది యువతి. అయితే పెద్దలు మాత్రం అతనితో పెళ్లికి అంగీకరించలేదు. ఇక వేరొకరితో పెళ్లి జరిపించారు. ఆ సమయంలో సైలెంట్ గానే ఉన్న యువతి పెళ్లి తర్వాత కూడా రహస్యంగా యువకుడితో ప్రేమాయణం నడపడం మొదలుపెట్టింది.


 ఇటీవలే మరింత బరితెగించి.. ఏకంగా ప్రేమికుడిని అత్తింటికి పిలిపించుకొని మరి గదిలో ఏకాంతంగా గడపాలి అని అనుకుంది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరు లేని సమయంలో పిలిచింది. అయితే అంతలోనే ఇంట్లోకి అత్తమామలు ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ జరుగుతుంది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏకంగా సదరు యువకుడిని తీవ్రంగా కొట్టి గ్రామ పెద్దల ముందు నిలబెట్టారు. ఈ క్రమంలోనే గ్రామ పెద్దలు ఆ యువతి యువకులు ఇద్దరికీ కూడా పెళ్లి చేశారు. పునీత అనే మహిళకు ఆమ్రేష్ కుమార్ తో మూడేళ్ల క్రితం వివాహం జరగగా పెళ్లికి ముందు ఆమెకు  ఒక యువకుడితో పరిచయం ఉండగా అతనితో పెళ్లి తర్వాత కూడా ప్రేమాయణం  నడిపింది. ఇక ఓ రోజు ఇంట్లో ఏకాంతంగా గడిపేందుకు ప్రియుడిని పిలువగా అత్తమామలకు దొరికేశారు. దీంతో ఇక ఊర్లో పెద్దలు చర్చించుకుని ఆ ప్రేమికులందరికీ పెళ్లి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: