ఈ సంఘటన నంద్యాలలోని దోర్నపాడు లో జరిగింది. ఈ మండలంలో క్రిష్టిపాడు గ్రామానికి చెందిన గోసుల పుల్లయ్య అనే వ్యక్తి ఒక కోడి పుంజును పెంచుతున్నాడు పుట్టినప్పుడే చాలా బొద్దుగా ఉండేది. అలాగే పెరిగాక కూడా బొద్దుగానే కనిపిస్తూ ఉండేది. బలంగా కూడా ఉంది అందుకే దాన్ని ఎవరికీ అమ్మడానికి సదరు యజమానికి మనసు అంగీకరించలేదు.
అలాగే దాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు. దాని పిల్లలు కూడా చాలా బలంగా ఉంటాయి. అయితే ఇది 9 ఏళ్ల పాటు బ్రతకడం నిజంగా ఆ ఏరియాలో సంచలనంగా మారింది. ఈ విషయాన్ని అక్కడ లోకల్ వెటర్నరీ డాక్టర్ హరిత కూడా మాట్లాడుతూ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఏ కోడి వయసు కూడా ఇప్పటి వరకు ఇంతలా ఉండలేదని ఇది రికార్డు సాధించే దిశగా బ్రతకడం నిజంగా ఆశ్చర్యం అంటూ వెల్లడించారు. ఇక బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజం అయ్యి ఇంకా ఎన్ని సంచలనాలు చూడాల్సి వస్తుందో ఏమో..!