నేటి సమాజంలో ఆడవారిపై జరుగుతున్న దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కామోద్రేకంతో ఆడవారి మాన ప్రాణాలతో కొందరు నీచులు చెలగాటమాడుతున్నారు. పది నెలల పసిపాప నుండి కాటికి కాళ్ళు చాపుకున్న పండు ముదుసలిని కూడా కొందరు మగాళ్లు కాదు కాదు మృగాళ్లు వదలడం లేదు. వావివరసలు చూడకుండానే కామ వాంఛ తీర్చుకోవడానికి పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు. ఇక తాజాగా ఓ నీచపు భర్త కొడుకు చూస్తుండగానే.. భార్యూ ఫ్రెండ్స్తో అత్యాచారం చేయించారు. ఈ దారుణ ఘటన కేరళలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలో 25 ఏళ్ల వివాహితపై భర్తే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన స్నేహితులతో కలిసి ఆమెకు బలవంతంగా మద్యం తాగించి ఆపై సామూహిక అత్యాచారంకు పాల్పడ్డారు. ఇక్కడ మరో దారుణ విషయం ఏంటంటే.. ఐదేళ్ల కొడుకు ముందే వివాహితపై అత్యాచారం చేయించాడు. తల్లిని కాపాడుకునేందుకు సదరు పసిబిడ్డ అడ్డుపడితే.. కొడుకును దారుణంగా చితకబాదారు సదరు తండ్రి. అయితే అత్యాచారం చేసిన తర్వాత ఆ దుర్మార్గుల నుంచి తప్పించుకున్న ఈ మహిళ పరుగులు తీస్తూ ఓ రోడ్డుపై పడిపోయింది.
అయితే రోడ్డుపై గాయాలతో పడిఉన్న సదరు మహిళను చూసిన ఓ వ్యక్తి తన కారులో ఇంటికి తీసుకెళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను హాస్పటల్లో చేర్చి చికిత్స అందించారు. అనంతరం ఆమెను విచారించగా.. మొత్తం విషయాన్ని బయటపెట్టింది. తన భర్త మాయమాటలు చెప్పి తనను తమ ఇద్దరి పిల్లలను పుతుకురిచ్చి బీచ్కు గురువారం తీసుకెళ్లి.. అటు నుంచి తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లినట్లు చెప్పింది. అక్కడే బలవంతంగా మద్యం సేవించి లైంగికంగా వేధించినట్లు చెప్పుకొచ్చింది. ఇదంతా తన ఐదేళ్ల కొడుకు ముందే జరిగిందని వాపోయింది. దీంతో ఈ విషయం సీరియస్గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. ప్రధాన నిందితుడైన భర్తతో పాటు అతని నలుగురు స్నేహితులను అరెస్టు చేశారు.