నేటి సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలు సామాన్య ప్రజల ఊహకు కూడా అందడం లేదు. సంరక్షించాల్సిన సొంత కుటుంబ సభ్యులే తమ ఆడవారి జీవితాలను చిదిమేస్తున్నారు. వావివరసలు మరిచి ఎందరో జీవితాలను సర్వనాశనం చేసిన దుర్మార్గులు ఉన్న ఈ సమాజంలో ఏదో ఒక చోట ఘోరాలు, నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఒక
భర్త కట్టుకున్న భార్యపై ఒక దారుణానికి ఒడిగట్టాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే తనపై ఇంతటి దారుణానికి పాల్పడ్డాడా అని ఆ
భార్య తల్లడిల్లిపోయింది. చివరికి పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయాన్ని గురించి తెలిపింది. దీంతో పోలీసులు సదరు భర్తను అరెస్టు చేసి వారి స్టయిల్ లో విచారించగా అతడు అతి దారుణమైన నిజాలను వెళ్లగక్కాడు.
పూర్తి వివరాలు తెలుసుకుంటే.. తమిళనాడులోని కడలూరు
పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎల్ఆర్ పాలెంలో మధసూదన్,
పార్వతి అనే దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరికీ 2018 సంవత్సరంలో పెళ్లయింది. ఈ నాలుగేళ్ల కాలంలో ఈ దంపతులకు ఓ బాబు కూడా పుట్టాడు. అయితే
భార్య, కొడుకుని పోషించాల్సిన
మధుసూదన్ మద్యానికి బానిసై వాళ్లని చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడు. డబ్బు సంపాదించడం, పూటుగా మద్యం తాగటం.. భార్యని హింసించడం మధసూదన్ కి దినచర్యగా మారింది. అంతే కాదు సుందరమూర్తి, మణికంఠన్ అనే ఇద్దరి స్నేహితుల నుంచి రూ. 25 వేలు అప్పుగా తీసుకుని.. ఆ డబ్బంతా మద్యం బాటిల్స్ కోసమే ఖర్చు చేశాడు. అయితే అప్పు తిరిగి ఇచ్చేయాలని స్నేహితులు గట్టిగా నిలదీయడంతో
మధుసూదన్ అప్పు తీర్చడానికి ఒక నీచమైన పని చేయడానికి నిర్ణయించుకున్నాడు.
అదేంటంటే తన భార్యను తన ఇద్దరు స్నేహితులతో పడుకోబెట్టడానికి సిద్దమయ్యాడు. కట్టుకున్న
భార్య అని కూడా ఆలోచించకుండా తన స్నేహితులకు
భార్య ఫోటోలు
వాట్సాప్ లో పంపించి.. తన
భార్య చాలా అందంగా ఉంటుందని.. కావాలంటే మీకు సొంతమవుతుందని చెప్పాడు. దీంతో మొదట్లో షాక్ అయినా.. ఆ తర్వాత వారిద్దరు కూడా అప్పుకి బదులుగా
మధుసూదన్ భార్యను శారీరకంగా అనుభవించడానికి రెడీ అయ్యారు. దీనితో ఒక రోజు రాత్రి
మధుసూదన్ తన
భార్య, తన కొడుకుకి మత్తు మందు ఇచ్చి తన స్నేహితులకు
ఫోన్ చేశాడు. ఇంటికి వచ్చిన వారిద్దరినీ తన
భార్య బెడ్ రూమ్ లోకి ఆహ్వానించి తాను బయటకు వెళ్ళిపోయాడు.
అయితే అపస్మారక స్థితిలో ఉన్న ఆమెపై సుందరమూర్తి, మణికంఠన్ తమ కామ వాంఛను తీర్చుకున్నారు. మరుసటి రోజు మద్దతు దిగిన తర్వాత భార్యకి జరిగిందంతా అర్థమైంది. తనపై ఎవరో అత్యాచారం చేశారని విషయాన్ని తెలుసుకున్న
పార్వతి మధుసూదన్ నిలదీసింది. మాటలు సరిగ్గా సమాధానం చెప్పలేక పోవడం తో అతడితో వాగ్వివాదానికి దిగింది. మరోవైపు కొడుకు మత్తు మందు ప్రభావం తో స్పృహ లేకుండా పడిపోయాడు. ఇది గమనించిన పార్వతీ తన కొడుకుని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించింది. అనంతరం నేరుగా
పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన
భర్త పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతన్ని పట్టుకుని నాలుగు తన్ని.. అతడి స్నేహితులను కూడా అరెస్టు చేశారు. ఈ ముగ్గురు దుర్మార్గుల పై సంబంధిత కేసులు నమోదు చేశారు.