ఎంత పెద్ద కేసులో అయినా.. కొన్ని చిన్న ఆధారాలే కీలకంగా నిలుస్తాయి. వాటి ఆధారంగానే పోలీసులు కేసుల‌ను ఛేదిస్తుంటారు. ఎంత తెలివైన నేర‌స్థులైనా వాళ్లు చేసే చిన్న మిస్టేక్స్ వారిని ప‌ట్టిస్తాయి. ఇప్పుడు కూడా అలాంటి కేసునే పోలీసులు చాక‌చ‌క్యంగా ఛేదించి శభాష్ అనిపించారు. అదేంటేంటే.. గ‌తేడాది ఏపీలో సంచ‌ల‌నం సృష్టించింది ఓ వృద్ధ దంప‌తుల కేసు. అయితే వీరిని దొంగ‌లే చంపేసి ఉంటార‌ని పోలీసులు మొద‌ట భావించారు.

పోయిన సంవత్సరం డిసెంబర్ 25 న‌రాత్రి బండారుపల్లి నాగేశ్వరరావు అలియాస్ నాగులు అలాగే అయన స‌తీమ‌ణి ప్రమీలారాణి దారుణ హత్యకు గుర‌య్యారు. కాగా వీరిని గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేసేందుకు ఇంట్లోకి వచ్చి హత్య చేసి ఉండవచ్చునని అప్ప‌ట్లో పోలీసులు అనుమానించి విచార‌ణ జ‌రిపారు.

ఈ కేసును పోలీసులు అనుమానాస్పద మృతి కింద నమోదు చేసి అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసుల‌కు పెద్ద‌గా ఆధారాలు ల‌భించ‌లేదు. కాగా ఈ దొంగ‌లు ఇంటి వెనుక ఉన్న మెయిన్‌ డోర్ తెరిచి లోపలికి ప్రవేశించారని గుర్తించి అనేక ర‌కాలుగా పోలీసులు విచార‌ణ‌ జ‌రిపారు. కాగా రీసెంట్ గా పెనమలూరులో ఏటీఎం దొంగతనం చేసిన దొంగ‌ల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు.

ఈ కేసులో వారి వేలిముద్రల ఆధారంగా కంచికచర్లలో వృద్ధ దంపతులను కూడా వీరే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఏటీఎం దొంగ‌త‌నం కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ప‌లు దొంగతనాలతో పాటు ఈ దొంగ‌లు చాలా హత్యల్లో పాల్గొన్న‌ట్టు పోలీసులు చెప్పారు. ఈ దొంగ‌ల‌కు ఒంటరిగా ఉండే మహిళలు, ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులే టార్గెట్ గా చోరీల‌కు పాల్ప‌డుతున్నారు. సహజంగానే మరణం పొందినట్లు అనుమానం రాకుండా హత్యలు చేస్తుంటారు వీరు. వీరు ఏపీలో చాలా ఏరియాల్లో దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డిన‌ట్టు పోలీసులు గుర్తించారు. చాకచ‌క్యంగా ఈ ముఠాను ప‌ట్టుకున్న పోలీసుల‌కు ప్ర‌శంస‌లు అందుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: