పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. ఈ క్రమంలోనే తమకు నచ్చిన భాగస్వామిని  జీవితంలోకి ఆహ్వానించి సరికొత్తగా జీవితాన్ని ప్రారంభించాలని అందరూ ఆశపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక పెళ్లి సమయంలో స్థోమతకు మించి ఖర్చు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే పెళ్లిని ఎంత గ్రాండ్ గా నిర్వహించుకున్నా.. ఇక సాంప్రదాయాలకు అనుగుణంగానే పెళ్లి తంతు జరుగుతూ ఉంటుంది. అయితే పెళ్లి విషయంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం సాంప్రదాయం కొనసాగుతూ ఉంటుంది. ఒక ప్రాంతంలో రాత్రి సమయంలో పెళ్లి జరిగితే.. ఇంకో ప్రాంతంలో ఉదయం సమయంలో పెళ్లి చేస్తూ ఉంటారు.


 కొన్ని ప్రాంతాల్లో వధువు ఇంటి వద్ద పెళ్లి జరిగితే.. మరికొన్ని ప్రాంతాల్లో వరుడి ఇంటి వద్ద వివాహం జరుపుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఒక్కో ప్రాంతంలో పెళ్లి విషయంలో ఒక్కో సాంప్రదాయం కొనసాగుతూ ఉంటుంది. అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉండే విచిత్రమైన సాంప్రదాయాలు అప్పుడప్పుడు తెరమీదకి వస్తూ అందరిని షాక్ అయ్యేలా చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఆచారం గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. అయితే పెళ్లి అనే బంధం లోకి అడుగుపెట్టిన నూతన వధూవరులు శారీరకంగా కలుసుకునేందుకు శోభనం అనే ఒక రోజని నిర్ణయిస్తారు పెద్దలు.


 ఇక ఆ రోజున వధూవరులను ఒకే గదిలోకి పంపించడం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. వధువుతో పాటు వధువు తల్లి కూడా శోభనం గదిలోకి వెళ్తుందట. వినడానికి షాకింగ్ గా ఉంది కదా. ఆఫ్రికాలోని కొన్ని పల్లెటూర్లలో ఈ వింత ఆచారం ఉందట. పెళ్లయ్యాక మొదటి రాత్రి శోభనం తంతులో వధువుతో పాటు బెడ్ రూమ్ లోకి ఒక పెద్ద ఆవిడని పంపుతారట. అయితే ఆ పెద్దావిడ ఏకంగా పెళ్లికూతురు తల్లి అయినా కావచ్చట. ఇక ఎక్కువ మంది మాత్రం పెళ్లికూతురు తల్లిని ఇలా శోభనం గదిలోకి పంపడం చేస్తూ ఉంటారట. ఈ వింత ఆచారం గురించి తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: