రాఖీ పండుగ వచ్చిందంటే చాలు అక్క తమ్ముళ్ల హడావిడి.. ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడ ఉన్న అక్క తమ్ముళ్లు కలుసుకోవడం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అక్క తమ్ముడికి లేదా అన్నకి రాఖీ కడుతుంది. ఇలా రాఖీ కట్టిన సోదరికి ఇక సోదరుడు ఏదో ఒక బహుమతి ఇవ్వడం లాంటిది చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న సాంప్రదాయం. అయితే రాఖీ పండుగ వచ్చినప్పుడు అక్క చెల్లి లేని అబ్బాయిలు.. అన్న తమ్ముడు లేని అమ్మాయిలు తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు అని చెప్పాలి.


ఒక అన్న ఉండి ఉంటే బాగుండేదో అని అమ్మాయిలు.. ఒక అక్కో చెల్లో నుండి ఉంటే బాగుండేది అని అబ్బాయిలు తెగ ఫీల్ అవుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే మరికొన్ని రోజుల్లో రాఖీ పండుగ రాబోతుంది. దీంతో ఎంతోమంది అక్క చెల్లెళ్లు ఇక తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు సిద్ధమైపోతున్నారు అని చెప్పాలి. అయితే ఇలా అన్నదమ్ములు లేని వారు ఎవరైనా సరే పక్కింటి వాళ్లను పొరుగింటి వాళ్లను సొంత అన్న అనుకుని వారికి రాఖీ కట్టడం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా షాకింగ్ ఘటన జరిగింది.



 ఒక చిన్నారికి ఉన్న బాధ చివరికి క్రైమ్ వైపు తల్లిదండ్రులను ఉసిగొలిపింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. రాఖీ కట్టేందుకు తమ్ముడు లేడు.. తమ్ముడు కావాలి అని కూతురు ఏడుస్తూ ఉండడంతో తల్లిదండ్రులు తరలిపోయారు.  ఏం చేయాలో తెలియక చివరికి చిన్న బాబును కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ కిడ్నాప్ ప్రయత్నం కాస్త బెడ్స్ కొట్టింది. చివరికి దంపతులు కటకటాల పాలయ్యారు. కోత్వాళి ప్రాంతంలోని ఫుట్పాత్ పై తల్లిదండ్రుల మధ్యలో నిద్రిస్తున్న నెల వయస్సు చిన్నారిని కిడ్నాప్ చేశారు దంపతులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా నిందితులు పట్టుబడ్డారు. ఎందుకు ఇలా కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అని అడగగా.  తమకు 17 ఏళ్ల కూతురు రాఖీ కట్టేందుకు అన్నదమ్ములు లేరు అని ఏడుస్తూ ఉండడంతో.. ఇలా కిడ్నాప్ చేసామని చెప్పడంతో అటు పోలీసులు సైతం షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: